Puri Jagannath: పోకిరి, బిజినెస్ మేన్ సీక్వెల్స్పై క్లారిటీ ఇదే..
ABN , First Publish Date - 2022-08-24T14:41:54+05:30 IST
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ (Puri Jagannath) దర్శకత్వంలో రూపొందిన లేటెస్ట్ మూవీ లైగర్ (Liger). మరికొన్ని గంటల్లో భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా 5 భాషలలో రిలీజ్ కాబోతోంది. విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ (Puri Jagannath) దర్శకత్వంలో రూపొందిన లేటెస్ట్ మూవీ లైగర్ (Liger). మరికొన్ని గంటల్లో భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా 5 భాషలలో రిలీజ్ కాబోతోంది. విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) హీరోగా నటించిన ఈ సినిమాతో బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య పాండే (Ananya Pandey) హీరోయిన్గా సౌత్ సినిమా ఇండస్ట్రీలకు పరిచయం అవుతోంది. ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ కలిసి నిర్మించాయి. విడుదల సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో పూరీ టీమ్ ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు.
ఈ ప్రమోషన్స్లో భాగంగా పూరి జగన్నాథ్ మాట్లాడుతూ ఆయన సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu)తో తెరకెక్కించిన పోకిరి (Pokiri), బిజినెస్ మేన్ (Businessman) సినిమాల సీక్వెల్స్పై అప్డేట్స్ ఇచ్చారు. పూరి జగన్నాథ్ సొంత సంస్థ వైష్ణో అకాడమి, ఇందిరా ప్రొడక్షన్స్ పతాకాలపై తెరకెక్కిన పోకిరి విడుదల తరువాత ప్రతిచోటా సెన్సేషన్ సృష్టించి.. కలెక్షన్స్ పరంగా సరికొత్త రికార్డ్స్ నెలకొల్పింది. పండుగాడుగా, కృష్ణ మనోహర్ ఐపీఎస్గా మహేష్ మైండ్ బ్లోయింగ్ యాక్టింగ్, మ్యానరిజమ్స్, డైలాగ్స్, ఎప్పటికీ మరచిపోలేము.
దీని తర్వాత వచ్చిన బిజినెస్ మేన్ సినిమా కూడా అంతే. అయితే, లైగర్ ప్రమోషన్స్లో మాట్లాడిన పూరి..“నాకు బిజినెస్ మ్యాన్ మూవీని త్వరలోనే హిందీ లో రీమేక్ చేసే ఆలోచన ఉంది. అలాగే గతంలో పోకిరి, బిజినెస్ మ్యాన్ మూవీస్ కి సీక్వెల్స్ చేద్దాం అని నేను, మహేష్ అనుకున్నాము. అయితే, అప్పటి పరిస్థితులు.. ఇద్దరి నెక్స్ట్ కమిట్మెంట్స్ వల్ల కుదరలేదు. నాకు పండుగాడు, సూర్య భాయ్.. రెండు క్యారెక్టర్స్ అంటే ఎంతో ఇష్టం. అన్నీ కలిసి వస్తే తప్పకుండా పోకిరి, బిజినెస్ మేన్ సినిమాలను త్వరలో సీక్వెల్స్ ప్లాన్ చేస్తున్నాను. అది కూడా తెలుగులో మహేష్ బాబుతోనే”.. అని వెల్లడించారు. దాంతో మహేష్ అభిమానులు చాలా ఆనందంగా ఉన్నారు. అధికారికంగా ఈ రెండు సినిమాల సీక్వెల్స్ని పూరి ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి.