Puri Jagannadh: డ్రీమ్ ప్రాజెక్ట్ (JGM) ఆగిపోయిందా..?
ABN , First Publish Date - 2022-09-04T15:57:21+05:30 IST
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ (Puri Jagannath) డ్రీమ్ ప్రాజెక్ట్ జనగణమన (JGM) ఆగిపోయిందా..? ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే టాక్ వినిపిస్తోంది. దీనికి కారణం లైగర్ (Liger) ప్రభావం అని కూడా చెప్పుకుంటున్నారు.
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ (Puri Jagannath) డ్రీమ్ ప్రాజెక్ట్ జనగణమన (JGM) ఆగిపోయిందా..? ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే టాక్ వినిపిస్తోంది. దీనికి కారణం లైగర్ (Liger) ప్రభావం అని కూడా చెప్పుకుంటున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu)తో తీసిన పోకిరి, బిజినెస్ మేన్ చిత్రాల తర్వాత చేయాల్సిన సినిమా జనగణమన (JGM). అంతేకాదు, ఇది పూరి డ్రీమ్ ప్రాజెక్ట్ కూడా. అయితే, ఈ సినిమా కథ మహేష్ బాబుకి నచ్చలేదనే కారణంగా ఆగిపోయింది. ఇది రిజెక్ట్ చేసినందుకే ఇద్దరి మధ్యన విబేధాలు కూడా వచ్చాయని ప్రచారం జరిగింది.
ఇక ఇదే డ్రీమ్ ప్రాజెక్ట్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)తో కూడా చేయాలనుకున్నారట పూరి. ఎందుకనో ఆయన కూడా ఈ కథ పట్ల ఆసక్తి చూపించలేదు. దాంతో ఎట్టకేలకి రౌడీ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)ను ఒప్పించారు. వీరద్దురు కలిసి లైగర్ సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలోనే డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి చెప్పి రౌడీ హీరోను ఒప్పించారు పూరి. అయితే, మూడేళ్ళు కష్టపడి తీసిన లైగర్ డిజాస్టర్ కావడంతో పూరి కనెక్ట్స్కి బాగా నష్టాలు వచ్చాయని టాక్ వినిపిస్తోంది.
ఇలాంటి సమయంలో రిస్క్ చేసి మరో పాన్ ఇండియా సినిమాను తీయడం ఎంతవరకు కరెక్ట్ అనే ఆలోచనలో పూరి టీమ్ ఉందట. ఈ మూవీకి దర్శకుడు వంశీ పైడిపల్లి కూడా ఓ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మరి బయట వినిపిస్తున్న టాక్ ప్రకారం అయితే ప్రస్తుతానికి పూరి డ్రీమ్ ప్రాజెక్ట్ ఆగిపోయిందనే వినిపిస్తోంది. సాధారణంగా పూరి ఏ సినిమా మొదలు పెట్టినా ఆపే ప్రసక్తే ఉండదు. చూడాలి మరి జనగణమన ఆగిందనే వార్తల్లో ఎంతవరకు నిజముందో..దీనిపై మేకర్స్ ఎప్పుడు క్లారిటీ ఇస్తారో.