Puri Jagannadh Assistant: పూరి జగన్నాధ్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆత్మహత్య.. కారణమదేనట!
ABN , First Publish Date - 2022-09-11T01:56:33+05:30 IST
‘లైగర్’ (Liger) సినిమా రిజల్ట్తో నిరాశలో ఉన్న పూరికి దెబ్బ మీద దెబ్బ అనేలా.. ఇప్పుడాయన అసిస్టెంట్ మరణవార్త కుదిపేస్తుంది. పూరి జగన్నాథ్ (Puri Jagannadh) దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్
‘లైగర్’ (Liger) సినిమా రిజల్ట్తో నిరాశలో ఉన్న పూరికి దెబ్బ మీద దెబ్బ అనేలా.. ఇప్పుడాయన అసిస్టెంట్ మరణవార్త కుదిపేస్తుంది. పూరి జగన్నాథ్ (Puri Jagannadh) దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ (Assistant Director)గా పని చేసిన సాయికుమార్ అనే యువకుడు హైదరాబాద్ దుర్గంచెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లుగా వచ్చిన వార్తతో ఒక్కసారిగా ఇండస్ట్రీలోనే కలకలం రేగుతోంది. సాయికుమార్ గతంలో పూరి దగ్గర పలు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడని తెలుస్తోంది. ప్రస్తుతం పూరి ముంబైలో మకాం పెట్టేయడంతో.. సాయికుమార్కి ఇక్కడ వేరే పని దొరకక, అప్పులు పాలయ్యాడని.. ఆ అప్పులు తీర్చలేకే ఆత్మహత్య చేసుకున్నాడనేలా టాలీవుడ్ సర్కిల్స్లో వినిపిస్తోంది.
కొన్ని రోజుల క్రితం దుర్గం చెరువులో పోలీసులకు ఓ మృతదేహం లభించగా.. అతని వివరాలు సేకరించిన పోలీసులకు.. అతను అంతకుముందు పూరి జగన్నాథ్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేసిన సాయికుమార్ అని తేలింది. పూరి జగన్నాథ్, ఛార్మీలు కలిసి పూరీ కనెక్ట్స్ స్థాపించిన తర్వాత.. వారి వద్ద ఉన్న టీమ్ని కూడా మార్చి, కొత్త టీమ్ని తీసుకున్నట్లుగా అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ సాయికుమార్ పాత టీమ్కి చెందిన వాడుగా టాక్ నడుస్తుంది. పూరి దగ్గర నుండి వచ్చేసిన తర్వాత సాయికుమార్కు సరైన ఉద్యోగం లభించకపోవడంతో అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని.. అప్పులు ఇచ్చిన వాళ్లు తీవ్రంగా ఒత్తిడి చేయడంతో.. ఆ ఒత్తిడిని తట్టుకోలేకే సాయికుమార్ ఆత్మహత్యకు పాల్పిడినట్లుగా సమాచారం. సాయికుమార్ మరణవార్త తెలిసిన పూరి కూడా తీవ్ర దిగ్భాంతికి లోనైనట్లుగా తెలుస్తోంది.
పూరి జగన్నాధ్, ఛార్మీ కౌర్ (Charmme Kaur)లు కలిసి.. విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)తో ‘లైగర్’ అనే పాన్ ఇండియా సినిమా నిర్మించగా.. ఆ సినిమా భారీ పరాజయం పాలైంది. ఈ సినిమా రిజల్ట్తో పూరి మనుగడే మరోసారి ప్రశ్నార్థంగా మారింది. ‘లైగర్’ విడుదల తర్వాత పూరి.. అసలు మీడియా ముందుకు రావడానికి కూడా ఇష్టపడటం లేదు. అలాగే విజయ్తో చేయాలనుకున్న తదుపరి చిత్రం ‘జనగణమన’ (JGM) చిత్రం ఆగిపోయినట్లుగా వార్తలు వస్తున్నాయి. దీంతో తన తదుపరి చిత్రం ఏమిటనేదానిపై మల్లగుల్లాలు పడుతున్న సమయంలో.. తన అసిస్టెంట్ మరణవార్త.. పూరిని మరింత వేధించడం ఖాయం అనేలా.. ఇప్పుడు ఆయన అభిమానులు సైతం మాట్లాడుకుంటుండటం గమనార్హం.