Puri Jagannadh: నా భార్య తిట్టింది.. అందుకే ఇలా..!
ABN , First Publish Date - 2022-08-15T21:36:11+05:30 IST
‘‘నేను కొత్త కథల వెనకపడటానికి కారణం నా భార్య. ‘కొత్త కొత్త దర్శకులు వస్తున్నారు మంచి మంచి సినిమాలు తీస్తున్నారు నువ్వు వెనకపడిపోతున్నావ్. ఇతర చిత్రాలు కూడా చూస్తుండు అని ఓ రోజు నన్ను బాగా తిట్టింది’’ అని పూరి జగన్నాథ్ (Puri Jagannadh) అన్నారు.
‘‘నేను కొత్త కథల వెనకపడటానికి కారణం నా భార్య. ‘కొత్త కొత్త దర్శకులు వస్తున్నారు మంచి మంచి సినిమాలు తీస్తున్నారు నువ్వు వెనకపడిపోతున్నావ్. ఇతర చిత్రాలు కూడా చూస్తుండు అని ఓ రోజు నన్ను బాగా తిట్టింది’’ అని పూరి జగన్నాథ్ (Puri Jagannadh) అన్నారు. వరంగల్లో జరిగిన ‘లైగర్’(Liger) ప్రీ రిలీజ్ వేడుకలో ఆయన మాట్లాడారు. విజయ్ దేవరకొండ (Vijay devara konda), అనన్యా పాండే (Ananya panday)జంటగా నటించిన ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్, ధర్మ పొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాయి. పూరి జగన్నాథ్, ఛార్మి, కరణ్ జోహర్, అపూర్వ మెహతా నిర్మాతలు. ఈ నెల 25న ప్యాన్ ఇండియా స్థాయిలో సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా పూరి జగన్నాథ్ మాట్లాడుతూ ‘‘
‘‘నేను కొత్త కథల వెనకపడటానికి కారణం నా భార్య. ఓ రోజు నన్ను తిట్టింది.. ‘కొత్త కొత్త దర్శకులు వస్తున్నారు మంచి మంచి సినిమాలు తీసుతున్నారు.. నువ్వు వెనకపడిపోతున్నావ్! పక్క సినిమాలు కూడా చూస్తుండు. సందీప్ రెడ్డి వంగా అనే డైరెక్టర్ వచ్చాడు. అర్జున్ రెడ్డి సినిమా తీసి సంచలనం సృష్టించాడు. నేను నా కూతురు మూడు సార్లు చూశాం., నువ్వూ చూడు’’ అని చెప్పింది. అప్పుడు అర్జున్రెడ్డి చూశా. డైరెక్షన్ బావుంది. సినిమా కూడా బాగా నడుస్తోంది. కానీ 45 నిమిషాలు చూసి ఆపేశా. కారణం.. సినిమాలో కుర్రాడిపై నా దృష్టి ఆగిపోయింది. ఇంత నిజాయితీగా ఒక కుర్రాడు నటిస్తున్నాడని విజయ్ గురించే ఆలోచిస్తూ ఉండిపోయా. అప్పుడే విజయ్తో సినిమా చేయాలని నిర్ణయించుకున్నా. విజయ్లో నాకు నచ్చేది నిజాయితీ. ‘లైగర్’లో ఎంత ఎలివేషన్ పెట్టినా కొంచెం పొగరు కూడా కనిపించదు. చాలా నిజాయితీగా చేశాడు. ఒక నిర్మాతగా విజయ్కి కోటి రూపాయలు ఇస్తే వద్దు ముందు సినిమా కోసం ఖర్చుపెట్టండని అంటాడు. తర్వాత రెండుకోట్లు పంపిస్తే. మాకు అప్పులున్నాయని తెలిసి.. ముందు అప్పులు తీర్చమని తిరిగిపంపించేస్తాడు. ఈ రోజుల్లో ఇలా ఎవరంటారు? విజయ్ నాన్నగారు మా అబ్బాయిని ఒక కొడుకులా చూసుకొని మంచి సినిమా తీయ్ అన్నారు. కానీ విజయ్ నన్ను ఒక తండ్రిలా చూసుకొని నా కష్టాల్లో నాతో పాటు నిల్చున్నాడు. విజయ్ లాంటి హీరోని నేను చూడలేదు. మైక్ టైసన్ని పట్టుకోవడానికి ఏడాది పట్టింది. ఆయన్ని ఈ సినిమాలోకి తీసుకొచ్చిన క్రెడిట్ ఛార్మికి దక్కుతుంది. మైక్ టైసన్ లాంటి లెజెండ్ తో కలిసి పని చేేస అవకాశం రావడం నా అదృష్టం. అనన్య ఫైర్ బ్రాండ్. అద్భుతంగా నటిస్తుంది. రమ్యకృష్ణ గారు రెబల్ తల్లిగా కనిపించినా స్ఫూర్తినిచ్చే పాత్ర. ఛార్మి సినిమా కోసం చాలా కష్టపడుతుంది. ఏ కష్టాన్ని నా వరకూ తీసుకురానివ్వదు. సెట్లో ఆమె ఏడ్చిన సందర్భాలున్నాయి. కానీ బయటపడదు. అలీతో చేసిన సినిమాలన్నీ హిట్టే. ఎప్పుడూ నాకు తోడుంటాడు. నా టీమ్తోపాటు కరణ్ జోహార్ ఎంతో సహకరించారు. ఎంతో కష్టపడి తీసిన ‘లైగర్’ ఈ నెల 25న వస్తోంది. ఇది ఫుల్లీ లోడెడ్ మసాలా మూవీ’’ అని అన్నారు.
మీ ప్రేమని తిరిగివ్వాలి.. విజయ్ దేవరకొండ
‘‘ప్రమోషన్స్ కోసం ఇండియా అంతా తిరిగి వరంగల్ వచ్చాం. ఎక్కడ తిరుగుతున్నా ఇక్కడి గురించే ఆలోచన. ‘లైగర్’ గురించి ఇక్కడ ఏమనుకుంటున్నారనే ఆలోచన. దేశంలో ఎక్కడికి వెళ్లినా ప్రేక్షకులు నాపై అమితమైన ప్రేమ కురిపించారు. ఊహించని రీతిలో జనాలు వచ్చారు. అసలు ఇంత ప్రేమ ఎందుకు చూపిస్తున్నారో అర్థం అయ్యేది కాదు. అభిమానులు పంచే ప్రేమను మరచిపోలేను. ఆగస్ట్ 25న మీ ప్రేమని తిరిగివ్వాలి. సినిమాపై ఎలాంటి డౌట్ లేదు బ్లాక్బస్టర్ హిట్ ఖాయం. తెలంగాణ, ఆంధ్రాలో షేక్ చేస్తే ఇండియా మొత్తం వినిపించాలి. పూరి రాసిన డైలాగులు చెప్పాలంటే అదృష్టం వుండాలి. ‘వి ఆర్ ఇండియన్స్.. పోదాం, కొట్లాడదాం.. ఆగ్ హే అందర్. దునియా కో ఆగ్ లగా దేంగే. సబ్ కి వాట్ లాగా దేంగే’ లైగర్లో పూరి రాసిన ఈ డైలాగ్ అంటే నాకు చాలా ఇష్టం. ఈ నెల 25న మనమందరం కలసి గట్టిగా కొట్టాలి’’ అని అన్నారు.