దేవుడి పక్కనే చోటిస్తున్నారు..

ABN , First Publish Date - 2021-11-18T22:54:40+05:30 IST

పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ చనిపోయి దాదాపుగా 20రోజులవుతోంది. అప్పు మృతి చెందిన నాటి నుంచి అశేషంగా అభిమానులు ఆయన సమాధిని దర్శిస్తూనే ఉన్నారు.

దేవుడి పక్కనే చోటిస్తున్నారు..

పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ చనిపోయి దాదాపుగా 20రోజులవుతోంది. అప్పు మృతి చెందిన నాటి నుంచి అశేషంగా అభిమానులు ఆయన సమాధిని దర్శిస్తూనే ఉన్నారు. పవర్ స్టార్‌ను తమ సొంత కుటుంబ సభ్యుడిలా భావించడంతో అందరూ తీవ్ర విచారంలో ఉన్నారు. పునీత్ మరణానంతరం కర్ణాటకలో గుండె పోటుతో మరణించే వారి సంఖ్య అధికమయింది. ఆత్మహత్యలు కూడా విపరీతంగా పెరిగాయంటే అతడిని ఎంతగా అభిమానిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. అప్పుని స్మరించుకుంటూ చాలా మంది ఉచిత అన్నదానం కూడా చేశారు. మరికొంత మంది మరో అడుగు ముందుకేశారు. తమ ఇళ్లల్లో దేవుడి పక్కనే చోటిస్తున్నారు. 


దక్షిణ కర్ణాటకలోని ఫొటో ఫ్రేమ్‌లను తయారుచేసే వ్యక్తులు మాట్లాడుతూ.. పునీత్ మరణించిన రెండు వారాల అనంతరం ఫొటో ఫ్రేమ్‌లకు డిమాండ్ పెరిగిందని చెబుతున్నారు.  ‘‘ పునీత్ ఫొటో ఫ్రేమ్‌లకు ప్రజలు పెద్ద ఎత్తున ఆర్డర్లు ఇస్తున్నారు. వేర్వేరు సైజులు, షేప్‌ల్లో ఉన్న ఫొటో ఫ్రేమ్‌ల ధర రూ.200 నుంచి రూ.2500 వరకు ఉంది. గత వారం రోజులుగా మేం వెరైటీ ఫ్రేమ్‌లను తయారు చేస్తున్నాం. దాదాపుగా 200 పునీత్ ఫ్రేమ్‌లను మా షాపు విక్రయించింది. మేం విక్రయించే ఫ్రేమ్‌ల్లో ఎక్కువగా మీటింగ్‌లు, సభల్లో ఉపయోగించేవి ఉంటున్నాయి. దేవతా మూర్తులను ఉంచే ఫ్రేమ్‌లకు ఎక్కువగా ప్రజలు ఆర్డర్లు ఇస్తున్నారు. ఆ ఫ్రేమ్‌లో పునీత్ ఫొటోను పెట్టి ఇవ్వాలని అడుగుతున్నారు ’’ అని ఫొటో ఫ్రేమ్ షాపులో పనిచేసే వ్యక్తి అయిన సంతోష్ తెలిపారు. 


పునీత్ రాజ్ కుమార్ జిమ్ చేస్తుండగా అకస్మాత్తగా కార్డియాక్ అరెస్టుకు గురయ్యారు. సమీపంలోని ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించిందని అక్కడి వైద్యులు తెలిపారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం విక్రమ్ ఆసుపత్రికి తరలించగా అక్కడే చికిత్స పొందుతూ ఆయన మరణించారు.  

Updated Date - 2021-11-18T22:54:40+05:30 IST