ఓటీటీ ప్లాట్‌ఫాంలోకి ‘జేమ్స్’.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే..!

ABN , First Publish Date - 2022-04-14T01:53:09+05:30 IST

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండె పోటుతో గత ఏడాది అక్టోబర్ 29న మరణించారు.

ఓటీటీ ప్లాట్‌ఫాంలోకి ‘జేమ్స్’.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే..!

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండె పోటుతో గత ఏడాది అక్టోబర్ 29న మరణించారు. జిమ్ చేస్తుండగా కార్డియాక్ అరెస్టుకు గురయి మృతి చెందారు. ఆయన హీరోగా నటించిన చివరి చిత్రం ‘జేమ్స్’. ఈ ఏడాది మార్చి 17న థియేటర్స్‌లో విడుదలైంది. కన్నడ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. యాక్షన్ ఎంటర్ టైనర్‌గా చేతన్ కుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 


‘జేమ్స్’ సినిమా విడుదలైన 4రోజుల్లోనే రూ.100కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించింది. శాండల్ వుడ్ బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఫుల్ రన్ పూర్తయ్యే సరికి ప్రపంచవ్యాప్తంగా రూ.150కోట్ల వసూళ్లను రాబట్టింది. ఈ మూవీ ఓటీటీ ప్లాట్‌ఫాంలో త్వరలోనే ప్రసారం కాబోతుందట. ఈ సినిమా స్ట్రీమింగ్ రైట్స్‌ను సోనీ‌ లివ్ దక్కించుకుందని వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఏప్రిల్ 14నుంచి ఈ చిత్రం అందరికీ అందుబాటులో ఉంటుందని టాక్ నడుస్తుంది. కానీ, ఓటీటీ ప్లాట్‌ఫాం మాత్రం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు.

Updated Date - 2022-04-14T01:53:09+05:30 IST