తండ్రి సమాధి వద్దే Puneeth Rajkumar అంత్యక్రియలు.. అమెరికాలో ఉన్న కూతురు..!

ABN , First Publish Date - 2021-10-30T01:11:54+05:30 IST

పునీత్‌ మృతి నేపథ్యంలో కర్నాటకలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో అధికారులు హై అలర్ట్‌ ప్రకటించారు. పునీత్‌ పార్థివ దేహాన్ని అభిమానుల సందర్శనార్థం బెంగళూరు కంఠీరవ స్టేడయంలో ఉంచనున్నారు.

తండ్రి సమాధి వద్దే Puneeth Rajkumar అంత్యక్రియలు.. అమెరికాలో ఉన్న కూతురు..!

కన్నడ పవర్‌ స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ శుక్రవారం గుండెపోటుతో కన్నుమూశారు. ఉదయం జిమ్‌ చేస్తుండగా ఒక్కసారిగా ఆయనకు ఛాతిలో నొప్పి వచ్చింది. వెంటనే ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన పరిస్థితి విషమించిందని వైద్యులు తెలిపారు. చిన్న వయసులోనే సూపర్ స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న పునీత్‌ మరణవార్త విని.. ఆయన అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు.


పునీత్‌ మృతి నేపథ్యంలో కర్నాటకలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో అధికారులు హై అలర్ట్‌ ప్రకటించారు. పునీత్‌ పార్థివ దేహాన్ని అభిమానుల సందర్శనార్థం బెంగళూరు కంఠీరవ స్టేడయంలో ఉంచనున్నారు. పునీత్‌ రాజ్‌కుమార్‌ అంత్యక్రియలు శనివారం తండ్రి సమాధి దగ్గరే నిర్వహించనున్నారు. అయితే పునీత్‌ కుమార్తె వందితా రాజ్ కుమార్ ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. దీంతో ఆమె ఇండియా వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Updated Date - 2021-10-30T01:11:54+05:30 IST