టీవీ తెరపై ‘కన్నడ కోటీశ్వరుడు’ షోతో హిస్టరీ క్రియేట్ చేసిన Puneeth Rajkumar.. అక్కడ అమితాబ్.. ఇక్కడ అప్పూ..!

ABN , First Publish Date - 2021-10-29T22:11:34+05:30 IST

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో 46ఏళ్ల వయసులో మరణించారు. అప్పు చిత్రం ద్వారా ఆయన హీరోగా వెండితెరకు పరిచయమయ్యారు.

టీవీ తెరపై ‘కన్నడ కోటీశ్వరుడు’ షోతో హిస్టరీ క్రియేట్ చేసిన Puneeth Rajkumar.. అక్కడ అమితాబ్.. ఇక్కడ అప్పూ..!

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో 46ఏళ్ల వయసులో మరణించారు. అప్పు చిత్రం ద్వారా ఆయన హీరోగా వెండితెరకు పరిచయమయ్యారు. ఈ సినిమా భారీ విజయం సాధించడంతో అభిమానులు మద్దుగా ఆయనను అప్పు అని పిలవడం మొదలెట్టారు.  


కౌన్ బనేగా కరోడ్ పతి(కేబీసీ) షో బుల్లి తెరపై ఎన్ని రికార్డులను క్రియేట్ చేసిందో అందరికీ తెలుసు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న అమితాబ్ బచ్చన్‌ను ఈ షోనే గట్టెక్కించందంటే అందులో అతిశయోక్తి లేదు. మన దగ్గర ఈ షో ‘‘ ఎవరు మీలో కోటీశ్వరుడు’’ అనే పేరుతో ప్రసారం అవుతోంది. కన్నడ వెర్షన్‌ షోకు పునీత్ రాజ్ కుమార్ హోస్ట్‌గా వ్యవహరించారు. 



కన్నడ బుల్లి తెరపై ఈ షో మొదటి సీజన్ 2017లో ప్రారంభమైంది. ఈ సీజన్‌ను పునీత్ రాజ్ కుమార్ హోస్ట్ చేశారు. మొదటి సీజన్ భారీ విజయం సాధించింది. దీంతో రెండో సీజన్‌కు కూడా ఆయనే హో‌స్ట్‌గా వ్యవహరించారు. మూడో సీజన్‌కు అనివార్య కారణాల వల్ల హోస్ట్‌గా చేయలేకపోయారు. నాలుగో సీజన్‌కు తిరిగి ఆయనే హోస్ట్‌గా వ్యవహరించడం మొదలెట్టారు. నాలుగో సీజన్ 2019లో ప్రసారం అయింది.    


‘‘ ఫ్యామిలీ పవర్ ’’ అనే షోకు కూడా పునీత్ హోస్ట్‌గా చేశారు. ఈ షో కలర్స్ కన్నడ ఛానల్‌లో ప్రసారం అయింది. ఈ షో 2017 నవంబర్ నుంచి 2018 ఏప్రిల్ వరకు ప్రసారం అయింది. ప్రస్తుతం నేత్రావతి అనే కన్నడ టీవీ షోకు ఆయన నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ షో ఉదయ టీవీలో ప్రసారం అవుతోంది.



Updated Date - 2021-10-29T22:11:34+05:30 IST