Puneeth Rajkumar ను తరలించిన ఆస్పత్రి వద్ద టెన్షన్ టెన్షన్.. కర్ణాటక అంతటా హై అలెర్ట్..!

ABN , First Publish Date - 2021-10-29T19:58:32+05:30 IST

కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో ఆస్పత్రిలో చేరడంతో కన్నడ ఇండస్ట్రీలో కలకలం మొదలయింది. ఇంట్లో వ్యాయామం చేస్తుండగా పునీత్ రాజ్ కుమార్‌కు గుండెపోటు వచ్చింది.

Puneeth Rajkumar ను తరలించిన ఆస్పత్రి వద్ద టెన్షన్ టెన్షన్.. కర్ణాటక అంతటా హై అలెర్ట్..!




కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో ఆస్పత్రిలో చేరడంతో కన్నడ ఇండస్ట్రీలో కలకలం మొదలయింది. ఇంట్లో వ్యాయామం చేస్తుండగా పునీత్ రాజ్ కుమార్‌కు గుండెపోటు వచ్చింది. వెంటనే ఆయన్ను బెంగళూరులోని విక్రమ్ ఆసుపత్రికి తరలించారు. ఐసీయూలో ఉంచి చికిత్సను అందిస్తున్నామని డాక్టర్లు ఓ ప్రకటన చేశారు. అదే సమయంలో పునీత్ రాజ్ కుమార్ కు సంబంధించిన హెల్త్ బులిటెన్‌ను మధ్యాహ్నం 3 గంటలకు ప్రెస్‌మీట్లో చెబుతామని ఆస్పత్రి యాజమాన్యం ప్రకటించింది. 

ఇదిలా ఉండగా కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, పలువురు స్టార్ హీరోలు, నిర్మాతలు, సినీ రాజకీయ ప్రముఖులు ఆస్పత్రికి వచ్చి వెళ్తుండటంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. తమ అభిమాన హీరోకు ఏమయిందా అన్న టెన్షన్ నెలకొంది. దీంతో అభిమానులంతా లక్షలాదిగా ఆస్పత్రికి, ఆయన ఇంటి వద్దకు చేరుకుంటున్నారు. దీంతో క‌ర్ణాట‌క రాష్ట్రవ్యాప్తంగా హైఅల‌ర్ట్‌‌ను విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆస్పత్రితో పాటు ప్రధాన మార్గాల్లో పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. సినిమా థియేటర్లను మూసివేయాలని కర్ణాటక సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. 

Updated Date - 2021-10-29T19:58:32+05:30 IST