James: 4 వేలకు పైగా థియేటర్లలో.. అప్పూ ఆఖరి చిత్రం
ABN , First Publish Date - 2022-03-17T03:23:59+05:30 IST
దివంగత నటుడు, కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్కుమార్ చివరి చిత్రమైన ‘జేమ్స్’ కోసం ప్రేక్షకులు ఎంతగా వేచి చూస్తున్నారో తెలియంది కాదు. ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు అన్నీ మంచి ఆదరణ పొందాయి. మిలియన్ల కొద్దీ వ్యూస్
దివంగత నటుడు, కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్కుమార్ చివరి చిత్రమైన ‘జేమ్స్’ కోసం ప్రేక్షకులు ఎంతగా వేచి చూస్తున్నారో తెలియంది కాదు. ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు అన్నీ మంచి ఆదరణ పొందాయి. మిలియన్ల కొద్దీ వ్యూస్ సాధించాయి. ఇప్పుడు చిత్రం విడుదలకు అన్నీ కార్యక్రమాలు పూర్తయ్యాయి. పునీత్ రాజ్కుమార్ జయంతి సందర్భంగా చిత్రాన్ని మార్చి 17న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల చేయబోతున్నారు. పాన్ ఇండియా వైడ్గా ఈ చిత్రం 4 వేలకు పైగా థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా చిరంజీవి, మోహన్ లాల్ వంటి స్టార్ హీరోలు ఈ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుతూ.. ఇదే పునీత్ రాజ్కుమార్కి ఇచ్చే నివాళి అని ప్రేక్షకులకు పిలుపునిచ్చారు.
ఈ సినిమా విడుదల సందర్భంగా మరే ఇతర సినిమాని వారం రోజుల పాటు విడుదల చేయకూడదనే సంచలన నిర్ణయాన్ని కన్నడ సినీ పరిశ్రమ తీసుకుంది. వారం రోజులకీ సరిపడ టికెట్లన్నీ ఇప్పటికే అమ్ముడవ్వడం విశేషం. అక్కడ ప్రమోషన్ కార్యక్రమాలు కూడా అభిమానులు భారీగా నిర్వహిస్తున్నారు. టాలీవుడ్లో ఈ చిత్రాన్ని.. చిత్రంలో విలన్గా నటించిన హీరో శ్రీకాంత్ తన మిత్రుడు విజయ్తో కలిసి విడుదల చేస్తున్నారు. పునీత్ రాజ్కుమార్ ఆర్మీ ఆఫీసర్గా నటించిన ఈ చిత్రంలో హీరోయిన్గా ప్రియా ఆనంద్ నటించారు. డాక్టర్ శివ రాజ్కుమార్, రాఘవేంద్ర రాజ్కుమార్, ప్రియా ఆనంద్, శ్రీకాంత్, శరత్ కుమార్, ముఖేష్ రిషి, ఆదిత్య మీనన్ తదితరులు నటించిన ఈ చిత్రాన్ని చేతన్ కుమార్ దర్శకత్వంలో కిశోర్ ప్రొడక్షన్స్ బ్యానర్పై కిశోర్ పత్తికొండ భారీ బడ్జెట్తో నిర్మించారు.