ఆ సినిమాలో... అతిథి పాత్రల్లో... Puneeth Rajkumar ఇద్దరు సోదరులు
ABN , First Publish Date - 2022-01-23T01:31:23+05:30 IST
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కొన్ని రోజుల క్రితం జిమ్లో వ్యాయామం చేస్తుండగా కార్డియాక్ అరెస్టు వల్ల మరణించారు.
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కొన్ని రోజుల క్రితం జిమ్లో వ్యాయామం చేస్తుండగా కార్డియాక్ అరెస్టు వల్ల మరణించారు. పునీత్ను అభిమానులందరు ఆప్యాయంగా ‘అప్పు’ అని పిలుచుకుంటారనే విషయం తెలిసిందే. అయితే, అప్పు చివరగా నటించిన చిత్రం ‘జేమ్స్’. చేతన్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో పునీత్ రాజ్ కుమార్ అన్నయ్యలిద్దరూ అతిథి పాత్రల్లో అలరించనున్నారట. శివ రాజ్కుమార్, రాఘవేంద్ర రాజ్కుమార్ ఒకే తెరపై కలసి కనిపించనున్నారని తెలియడంతో వారి కుటుంబ అభిమానుల ఆనందానికి ప్రస్తుతం హద్దులేకుండా పోయింది.
‘‘దర్శకుడు చేతన్ కుమార్ పునీత్తో సహా సోదరులిద్దరిని తన సినిమాలో చూపించాలనుకున్నారు. కానీ, అప్పు మరణంతో అది సాధ్యపడలేదు. ప్రస్తుతం పునీత్ సోదరులిద్దరు చిత్రీకరణలో పాల్గొంటున్నారు. విఎఫ్ఎక్స్ సహాయంతో ఆ షాట్స్ను పునీత్ నటించిన సీన్స్తో కలుపుతారు’’ అని చిత్ర బృందానికి చెందిన ఒక వ్యక్తి చెప్పారు. ప్రస్తుతం జేమ్స్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. పునీత్ తప్ప అన్ని పాత్రలకు సంబంధించిన డబ్బింగ్ కూడా పూర్తయిందని తెలుస్తోంది. అప్పు పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాని మార్చి 17న విడుదల చేయాలనే ఆలోచనలో నిర్మాతలు ఉన్నట్టు సమాచారం.