Sky: ఒక వ్యక్తి అన్నీ కోల్పోయి ఒంటరిగా బ్రతకాల్సి వస్తే..

ABN , First Publish Date - 2022-09-28T02:42:12+05:30 IST

ఒక వ్యక్తి అన్నీ కోల్పోయి ఒంటరిగా బ్రతకాల్సి వస్తే.. అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోన్న చిత్రం ‘స్కై’ (Sky). ఆనంద్, మురళీ కృష్ణంరాజు, శృతిశెట్టి, మెహబూబ్ షేక్..

Sky: ఒక వ్యక్తి అన్నీ కోల్పోయి ఒంటరిగా బ్రతకాల్సి వస్తే..

ఒక వ్యక్తి అన్నీ కోల్పోయి ఒంటరిగా బ్రతకాల్సి వస్తే.. అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోన్న చిత్రం ‘స్కై’ (Sky). ఆనంద్, మురళీ కృష్ణంరాజు, శృతిశెట్టి, మెహబూబ్ షేక్ (ఎమ్.ఎస్), రాకేష్ మాస్టర్ ముఖ్య తారాగణంగా పృథ్వి పేరిచర్ల (Prudhvi Pericharla) దర్శకత్వంలో.. వేలర్ ఎంటర్‌టైన్‌మెంట్ స్టూడియోస్ బ్యానర్‌పై నాగిరెడ్డి గుంటక (Nagi Reddy Guntaka) - మురళీ కృష్ణంరాజు (Murali Krishnam Raju) సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రసూల్ ఎల్లోర్ (Rasool Ellore) ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం చివరి షెడ్యూల్ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా దర్శకనిర్మాతలు చిత్ర విశేషాలను తెలియజేశారు. 


‘‘ఒక వ్యక్తి అన్నీ కోల్పోయి ఒంటరిగా బ్రతకాల్సి వస్తే.. అతని పరిస్థితి ఎలా ఉంటుంది? ఏళ్ల తరబడి అందరితో కలిసి బాధ, ఆనందం పంచుకున్న అలాంటి వ్యక్తి సడెన్‌గా ఒంటరితనాన్ని జయించాడా, లేదా? లేక ఏకాకి జీవితమే కదా అని రోజు గడవడం కోసం తుంటరిగా పక్కవాడిని మోసం చేస్తూ బ్రతికేస్తున్నాడా? అసలు ఒంటరితనం మనిషికి ఏం నేర్పుతుంది? మనిషిని ఎలా మలుస్తుంది? అనేది క్లుప్తంగా ‘స్కై’ చిత్ర కథాంశం. రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రఫీ, సురేష్ ఆర్స్ ఎడిటింగ్ ఈ చిత్రానికి మెయిన్ పిల్లర్స్. తప్పకుండా ప్రతి వ్యక్తిని టచ్ చేసే సినిమాగా ఈ చిత్రం ఉంటుంది..’’ అని దర్శకుడు పృథ్వి పేరిచర్ల తెలిపారు. చివరి షెడ్యూల్‌లో కొన్ని కీలక సన్నివేశాలతో పాటు, ప్యాచ్ వర్క్ కూడా పూర్తి చేయనున్నామని, తెలుగువారంతా గర్వపడే చిత్రంగా ‘స్కై’ చిత్రాన్ని తీర్చిదిద్దేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నామని నిర్మాతలు పేర్కొన్నారు. (Sky Movie Update)

Updated Date - 2022-09-28T02:42:12+05:30 IST