నిర్మాత, దర్శకుడు బాబా విక్రమ్ మృతి
ABN , First Publish Date - 2022-04-10T14:19:34+05:30 IST
మాజీ ముఖ్యమంత్రి, దివంగత కలైంఙ్ఞర్ ఎం.కరుణానిధి కథ, మాటలు, స్ర్కీన్ప్లే సమకూర్చిన ‘కలైంఙ్ఞరిన్ కన్నమ్మ’ చిత్ర దర్శకనిర్మాత బాబా విక్రమ్ శుక్రవారం మృతిచెందారు. 83 యేళ్ళ
అడయార్(చెన్నై): మాజీ ముఖ్యమంత్రి, దివంగత కలైంఙ్ఞర్ ఎం.కరుణానిధి కథ, మాటలు, స్ర్కీన్ ప్లే సమకూర్చిన ‘కలైంఙ్ఞరిన్ కన్నమ్మ’ చిత్ర దర్శకనిర్మాత బాబా విక్రమ్ శుక్రవారం మృతిచెందారు. 83 యేళ్ళ బాబా విక్రమ్ వృద్ధాప్యం కారణంగా చిత్ర రంగానికి దూరమై తన సొంతూరు తిరునెల్వేలి జిల్లాలోని ఆళ్వార్కురిచ్చిలో నివసిస్తున్నారు. అక్కడే బాబా ఆలయాన్ని సొంతగా నిర్మించి, పూజలు చేసేవారు. అయితే గత కొన్ని రోజులుగా పలు అనారోగ్య సమస్యల తో బాధ పడుతున్న ఆయన శుక్రవారం గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపట్ల కోలీవుడ్ దర్శకులు సంఘంతో పాటు పలువురు ప్రముఖుల తమ ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని వెల్లడించారు.