మళ్లీ తండ్రయిన నిర్మాత Dil Raju..
ABN , First Publish Date - 2022-06-29T16:00:45+05:30 IST
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు (Dil Raju) మళ్ళీ తండ్రయ్యారు. ఆయన సతీమణి తేజస్విని(Tejaswini) బుధవారం ఉదయం మగ బిడ్డకు జన్మనిచ్చారు. దీంతో ఆయన ఇంట పండగ వాతావరణం నెలకొంది.
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు (Dil Raju) మళ్ళీ తండ్రయ్యారు. ఆయన సతీమణి తేజస్విని(Tejaswini) బుధవారం ఉదయం మగ బిడ్డకు జన్మనిచ్చారు. దీంతో ఆయన ఇంట పండగ వాతావరణం నెలకొంది. సినీ ప్రముఖులు దిల్ రాజుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తేజస్వినిని దిల్ రాజు డిసెంబర్ 10, 2020లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. నిజామాబాద్లోని ఫామ్ హౌస్లో పరిమిత సంఖ్యలోని సినీ ప్రముఖులు, స్నేహితులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ వివాహం జరిగింది. దిల్ రాజుకిది రెండో వివాహం. ఆయన మొదటి భార్య అనిత 2017లో గుండెపోటుతో మృతి చెందారు.
దిల్రాజు, అనితలకు హన్షిత అనే కుమార్తె ఉంది. ప్రస్తుతం ఆమె దిల్ రాజు రూపొందిస్తున్న కొన్ని సినిమాల నిర్మాణానికి సంబంధించిన పనులను చూసుకుంటూనే, తెలుగు డిజిటల్ మాధమ్యం ఆహాలోనూ భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు. ఇక దిల్ రాజు ప్రస్తుతం తెలుగు, తమిళంతో పాటుగా పాన్ ఇండియా సినిమాలను నిర్మిస్తున్నారు. కోలీవుడ్ హీరో దళపతి విజయ్తో వారసుడు (Varasudu) (తమిళంలో వారిసు) అనే సినిమాను చేస్తున్న సమయంలోనే ఆయన ఇంటికి నిజమైన వారసుడు రావడం విశేషం.
మరో వైపు రామ్ చరణ్ (Ram Charan), శంకర్ (Shankar) కాంబినేషన్లో దిల్ రాజు, శిరీష్ కలిసి పాన్ ఇండియా సినిమాను భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. కియారా అద్వానీ (Kiara Advani) కథానాయికగా నటిస్తోంది. అంతేకాదు, అక్కినేని నాగ చైతన్య (Naga Chaithanya), రాశీ ఖన్నా (Rashi Khanna) జంటగా 'థాంక్యూ' (Thankyou) చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విక్రమ్ కె కుమార్ (Vikram K Kumar) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇవి కాక మరికొన్ని సినిమాలు నిర్మాణంలో ఉన్నాయి.