ఎస్.పి. బాలుకి పద్మ విభూషణ్: రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారం అందుకున్న ఎస్.పి. చరణ్
ABN , First Publish Date - 2021-11-10T02:34:02+05:30 IST
గానగంధర్వుడు దివంగత ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యంను ఆయన మరణానంతరం భారత ప్రభుత్వం పద్మ విభూషణ్ పురస్కారం ప్రకటించి గౌరవించిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు పద్మ భూషణ్ పురస్కారం గాయని చిత్రకు ప్రకటించారు. కళారంగానికి
గానగంధర్వుడు దివంగత ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యంను ఆయన మరణానంతరం భారత ప్రభుత్వం పద్మ విభూషణ్ పురస్కారం ప్రకటించి గౌరవించిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు పద్మ భూషణ్ పురస్కారం గాయని చిత్రకు ప్రకటించారు. కళారంగానికి సంబంధించి వీరిని ఈ పురస్కారాలకు ఎంపిక చేశారు. కాగా నేడు(మంగళవారం) రాష్ట్రపతి భవన్లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఎస్.పి. బాలుకి వచ్చిన పద్మ విభూషణ్ పురస్కారాన్ని ఆయన తనయుడు ఎస్.పి చరణ్, రాష్ట్రపతి రామ్నాధ్ కోవింద్ చేతుల మీదుగా అందుకున్నారు. గాయని చిత్ర కూడా ఇదే వేదికపై పద్మ భూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు. వీరితో పాటు పద్మ అవార్డులు వచ్చిన అందరూ రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారాలను స్వీకరించారు. ప్రస్తుతం చిత్ర, చరణ్ అవార్డులు స్వీకరిస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.