Rumours on Social Media: విలక్షణ నటుడు చనిపోయాడంటూ వార్తలు.. అది శాడిజం అంటూ..

ABN , First Publish Date - 2022-07-28T19:46:45+05:30 IST

ఇటీవల కొందరు బాలీవుడ్ ప్రముఖులు, పాపులర్ ఫిగర్స్ చనిపోయారంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి...

Rumours on Social Media: విలక్షణ నటుడు చనిపోయాడంటూ వార్తలు.. అది శాడిజం అంటూ..

ఇటీవల కొందరు బాలీవుడ్ ప్రముఖులు, పాపులర్ ఫిగర్స్ చనిపోయారంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా వయస్సయిపోయి జీవితం చివరి దశలో ఉన్న నటుల గురించి ఇలాంటి రూమర్స్ ఎక్కువగా వస్తున్నాయి. తాజాగా ఒకప్పుడు బాలీవుడ్ సినిమాల్లో విలన్‌గా చేసి విలక్షణ నటుడిగా గుర్తింపు పొందిన ప్రేమ్ చోప్రా చనిపోయారంటూ వార్తలు వచ్చాయి. వీటిపై తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. శాడిజం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఆయన మాట్లాడుతూ.. ‘ఇది శాడిజం తప్ప మరింకేం కాదు. నేను ఇక చనిపోయానని ప్రజలకు తప్పుగా తెలియజేయడం ద్వారా ఎవరో శాడిస్టిక్ ఆనందాన్ని పొందుతున్నారు. కానీ ఇక్కడ నేను మీతో మాట్లాడుతున్నాను. అంటే అది ఎంత చెత్త ప్రచారమో తెలుసుకోవడానికి ఇది చాలు.


ఉదయం నుంచి నాకు ఈ తరహా కాల్స్ ఎన్ని వచ్చాయో చెప్పలేను. నాకు రాకేష్ రోషన్ ఫోన్ చేశాడు. ట్రేడ్ అనలిస్ట్ అమోద్ మెహ్రా కాల్ చేశాడు. కానీ ఇలాంటి పని ఎవరూ చేశారని నాకు ఇంకా ఆశ్చర్యంగా ఉంది. అలాగే గత నాలుగు నెలల క్రితం, నా క్లోజ్ ఫ్రెండ్ జితేంద్ర విషయంలోనూ ఎవరో ఇలాంటి పనే చేశారు. ఇలాంటి ప్రచారాలు కచ్చితంగా ఆపేయాలి’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా.. ‘షాహిద్’, ‘ఉప్కార్’, ‘పురబ్ ఔర్ పశిమ్’, ‘దో రాస్తే’, ‘కటి పతంగ్’, ‘దో అంజానే’ వంటి సినిమాలో ప్రేమ్ చోప్రా బాలీవుడ్‌లో మంచి గుర్తింపు పొందారు.

Updated Date - 2022-07-28T19:46:45+05:30 IST