గుడ్ న్యూస్ చెప్పిన Pranitha Subhash.. కూతురు పుట్టిందంటూ Instagram లో ఫొటో పోస్ట్

ABN , First Publish Date - 2022-06-11T20:37:50+05:30 IST

టాలీవుడ్‌లోని స్టార్ హీరోలందరి సరసన నటించిన హీరోయిన్ ప్రణీత సుభాష్ (Pranitha Subhash). ‘అత్తారింటికి దారేది’, ‘పాండవులు, పాండవులు తుమ్మెద’, ‘బ్రహ్మోత్సవం’ వంటి సినిమాల్లో నటించి తెలుగు

గుడ్ న్యూస్ చెప్పిన Pranitha Subhash.. కూతురు పుట్టిందంటూ Instagram లో ఫొటో పోస్ట్

టాలీవుడ్‌లోని స్టార్ హీరోలందరి సరసన నటించిన నటి ప్రణీత సుభాష్ (Pranitha Subhash). ‘అత్తారింటికి దారేది’, ‘పాండవులు, పాండవులు తుమ్మెద’, ‘బ్రహ్మోత్సవం’ వంటి సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను అలరించింది. తాజాగా ఆమె పండటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ గుడ్ న్యూస్‌ను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. గత కొన్ని రోజులు కలగా గడిచాయని తెలిపింది. 


ప్రణీత పాపతో తీసుకున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ సందర్భంగా ఓ మెసేజ్‌ను కూడా పోస్ట్ చేసింది. ‘‘పాప పుట్టినప్పటి నుంచి ఓ కలలా గడిచింది. నాకు గైనకాలజిస్ట్ అయిన తల్లి ఉండటం అదృష్టం. కానీ, ఈ రోజులు ఆమెకు మానసికంగా కష్టతరమైనవి. డాక్టర్ సునీల్ ఈశ్వర్, అతడి బృందం నా డెలివరీని సులభంగా జరిగేలా చూశారు. డాక్టర్ సుబ్బు, అతడి బృందానికి కృతజ్ఞతలు. ఈ స్టోరీని మీకు చెప్పకుండా ఉండలేకపోతున్నాను’’ అని ప్రణీత ఇన్‌స్టా వేదికగా తెలిపింది. ఈ మెసేజ్‌ను పోస్ట్ చేయగానే ప్రణీతకు నెటిజన్స్‌తో పాటు సెలబ్రిటీలు కూడా శుభాకాంక్షలు తెలిపారు. ప్రణీత 2021 మే 30న వ్యాపారవేత్త నితిన్‌ రాజు(Nitin Raju)ను పెళ్లాడింది. ఈ వివాహానికి కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ప్రణీత ఈ ఏడాది ఏప్రిల్‌లో తల్లికాబోతున్న విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఆమె చివరగా.. ‘భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా’ (Bhuj: The Pride of India) సినిమాలో కనిపించింది.



Updated Date - 2022-06-11T20:37:50+05:30 IST