‘కెజియఫ్ 2’ చిత్ర బృందానికి ప్రభాస్ అభినందనలు
ABN , First Publish Date - 2022-04-24T03:37:19+05:30 IST
పాన్ ఇండియా సినిమాగా విడుదలై రికార్డులు క్రియేట్ చేస్తున్న ‘కెజియఫ్ 2’ చిత్ర బృందానికి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభినందనలు తెలిపారు. సోషల్ మీడియా వేదికగా ‘బ్లాక్బస్టర్ విజయం సాధించిన కెజియఫ్ 2 చిత్ర బృందం మొత్తానికి
పాన్ ఇండియా సినిమాగా విడుదలై రికార్డులు క్రియేట్ చేస్తున్న ‘కెజియఫ్ 2’ చిత్ర బృందానికి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభినందనలు తెలిపారు. సోషల్ మీడియా వేదికగా ‘బ్లాక్బస్టర్ విజయం సాధించిన కెజియఫ్ 2 చిత్ర బృందం మొత్తానికి నా అభినందనలు’ అని ప్రభాస్ తెలిపారు. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం తర్వాత విడుదలైన ‘కెజియఫ్ 2’ చిత్రం.. ఆ చిత్రంతో పోటీగా కలెక్షన్లను రాబడుతోన్న విషయం తెలిసిందే. నార్త్లో కూడా ఈ చిత్రం ఊహించని విధంగా కలెక్షన్లని రాబడుతోంది. బాలీవుడ్ నటులు సంజయ్ దత్, రవీనా టాండన్ ఈ చిత్రంలో కీలక పాత్రలలో నటించారు. రాకింగ్ స్టార్ యశ్ నటనకు, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ టేకింగ్కు ప్రేక్షకులే కాకుండా.. సెలబ్రిటీలెందరో అభినందనల వర్షం కురిపిస్తున్నారు. కాగా, హోంబలే ఫిలింస్ బ్యానర్పై విజయ్ కిరంగదూర్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో నిర్మించారు.