జ్యోతిష్యం గురించి కంగనా రనౌత్ అలా చెప్పిందంటున్న ప్రభాస్.. ఇంతకీ సంగతేంటంటే..

ABN , First Publish Date - 2022-03-11T21:31:05+05:30 IST

‘బాహుబలి’ సినిమాతో ప్రభాస్ స్టార్‌డమ్ పాన్ ఇండియా స్థాయికి చేరింది. ఈ యంగ్ రెబల్ స్టార్ ప్రస్తుతం చేస్తున్నవన్నీ..

జ్యోతిష్యం గురించి కంగనా రనౌత్ అలా చెప్పిందంటున్న ప్రభాస్.. ఇంతకీ సంగతేంటంటే..

‘బాహుబలి’ సినిమాతో ప్రభాస్ స్టార్‌డమ్ పాన్ ఇండియా స్థాయికి చేరింది. ఈ యంగ్ రెబల్ స్టార్ ప్రస్తుతం చేస్తున్నవన్నీ పాన్ ఇండియా చిత్రాలే. ఆయన చేతిలో ప్రస్తుతం ‘సలార్’, ‘ప్రాజెక్ట్ కే’, ‘స్పిరిట్’ చిత్రాలు ఉన్నాయి. అయితే, తాజాగా ఆయన నటించిన  చిత్రం ‘రాధేశ్యామ్’. ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణకుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీ మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఇందులో ప్రభాస్ ప్రముఖ జ్యోతిష్కుడిగా నటించాడు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో రాజమౌళితో బాలీవుడ్ నటి కంగనా గురించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.


 టాలీవుడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో 2009లో తెరకెక్కిన ‘ఏక్ నిరంజన్’ సినిమాలో ప్రభాస్, కంగన జంటగా నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమా సమయంలో తనకు ఎదురైన ఓ సంఘటన గురించి కంగన చెప్పిందట. ప్రభాస్ మాట్లాడుతూ.. ‘హిమాచల్ ప్రదేశ్‌లోని చిన్న టౌన్‌లో కంగన పుట్టి పెరిగింది. ఆమెకి సినిమాలకి ఏమాత్రం సంబంధం లేదు. అయితే అక్కడే ఓ జోతిష్కుడిని కలిసిందట. ఆయన తాను కచ్చితంగా హీరోయిన్ అవుతుందని చెప్పాడంట. 


అయితే కంగన మాత్రం ఆ మాటలను అస్సలు నమ్మలేదంట. ఎందుకంటే తనలాంటి చిన్న టౌన్‌కి చెందిన అమ్మాయికి అది కష్టమని, అందరూ హీరోయిన్ అవుతానని చెబుతూ ఫూల్ చేస్తున్నారని అనుకున్నదంట. అయితే అనంతరం ఆమె హీరోయిన్‌గా మారిన విషయం తెలిసిందే. ఇలాంటి సంఘటనలను మనం ఎన్నో వింటుంటాం. కానీ నమ్మడం మాత్రం చాలా కష్టం’ అంటూ  చెప్పుకొచ్చాడు.

Updated Date - 2022-03-11T21:31:05+05:30 IST