‘రాధేశ్యామ్’ రిలీజ్‌కు ముందే కొత్త జీవో వస్తే సంతోషిస్తా: ప్రభాస్

ABN , First Publish Date - 2022-03-07T22:32:14+05:30 IST

సినిమా టికెట్ల ధరలపై ఏపీ ప్రభుత్వం ఇవ్వాల్సిన కొత్త జీవోని తన సినిమా విడుదలకు ముందే ఇస్తే.. చాలా సంతోషిస్తానని తెలిపారు గ్లోబల్ స్టార్ ప్రభాస్. ఆయన హీరోగా నటించిన చిత్రం ‘రాధేశ్యామ్’. భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ పాన్ ఇండియా చిత్రం

‘రాధేశ్యామ్’ రిలీజ్‌కు ముందే కొత్త జీవో వస్తే సంతోషిస్తా: ప్రభాస్

సినిమా టికెట్ల ధరలపై ఏపీ ప్రభుత్వం ఇవ్వాల్సిన కొత్త జీవోని తన సినిమా విడుదలకు ముందే ఇస్తే.. చాలా సంతోషిస్తానని తెలిపారు గ్లోబల్ స్టార్ ప్రభాస్. ఆయన హీరోగా నటించిన చిత్రం ‘రాధేశ్యామ్’. భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ పాన్ ఇండియా చిత్రం మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ప్రభాస్ చిత్ర ప్రచార కార్యక్రమాలతో బిజీబిజీగా గడుపుతున్నారు. తాజాగా జరిగిన చిత్ర ప్రచార కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వం విడుదల చేయాల్సిన సినిమా టికెట్ల ధరల కొత్త జీవోపై మాట్లాడారు.




‘‘ఏపీ ప్రభుత్వం టికెట్ల ధరలను పెంచుతూ కొత్త జీవోని విడుదల చేస్తే సంతోషిస్తా. ‘రాధేశ్యామ్’ చిత్ర విడుదలకు ముందే ఆ జీవో వస్తే ఇంకా సంతోషిస్తా. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ చిత్రాన్ని రూపొందించాం. దీనికి భారీగా ఖర్చయింది. సినిమా విడుదలకు ముందే ఏపీ ప్రభుత్వం కొత్త జీవోని విడుదల చేస్తుందని అంతా భావిస్తున్నాం..’’ అని ప్రభాస్ అన్నారు. కాగా, సినిమా టికెట్ల ధరల నిమిత్తమై ఏపీ సీఎం జగన్‌ను ఇటీవల మెగాస్టార్ చిరంజీవి అండ్ టీమ్ కలిసిన విషయం తెలిసిందే. జగన్‌ను కలిసిన వారిలో ప్రభాస్ కూడా ఉన్నారు. ఈ మీటింగ్ అనంతరం 10 రోజుల్లో కొత్త జీవో వస్తుందని, ఏపీలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన కష్టాలు తీరినట్లేనని చిరంజీవి అండ్ టీమ్ ప్రకటించారు. ఈ భేటీ జరిగి దాదాపు నెలరోజులు కావస్తున్నా.. ఏపీ ప్రభుత్వం కొత్త జీవోని విడుదల చేయలేదు. కారణం ఏమిటనేది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఆ ఊపు కాస్త తగ్గింది కాబట్టి.. టికెట్ ధరలకు సంబంధించిన కొత్త జీవోని ఏపీ ప్రభుత్వం అతి త్వరలోనే విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Updated Date - 2022-03-07T22:32:14+05:30 IST