అఫీషియల్: ‘రాధేశ్యామ్’ ఓటీటీ రిలీజ్.. ఎప్పుడంటే?

ABN , First Publish Date - 2022-03-28T23:04:26+05:30 IST

‘బాహుబలి’తో గ్లోబల్ స్టార్‌గా మారిన ప్రభాస్, ‘బుట్టబొమ్మ’ పూజా హెగ్డే జంటగా.. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ప్రతిష్టాత్మక చిత్రం ‘రాధే శ్యామ్’. మార్చి 11న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మంచి స్పందనే

అఫీషియల్: ‘రాధేశ్యామ్’ ఓటీటీ రిలీజ్.. ఎప్పుడంటే?

‘బాహుబలి’తో గ్లోబల్ స్టార్‌గా మారిన ప్రభాస్, ‘బుట్టబొమ్మ’ పూజా హెగ్డే జంటగా.. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ప్రతిష్టాత్మక చిత్రం ‘రాధే శ్యామ్’. మార్చి 11న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మంచి స్పందనే రాబట్టుకుంది. ప్రస్తుతం ఈ చిత్రం ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ప్రేక్షకులకు విజువల్ ఫీస్ట్ ఇచ్చిన ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ఏప్రిల్ 1 నుండి స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ విషయాన్ని అమెజాన్ ప్రైమ్ ఓటీటీ సంస్థ అధికారికంగా తెలియజేస్తూ.. పోస్టర్‌తో పాటు ప్రత్యేకంగా ఓ ట్రైలర్‌ని కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 


ఈ సందర్భంగా మేకర్స్ మాట్లాడుతూ.. థియేటర్లలో చూసిన వాళ్లు, చూడని వాళ్లందరి కోసం.. ఇప్పుడు ఇంటిలోని అందరితో కలిసి చూసేలా అమెజాన్‌ ప్రైమ్ వీడియోలో ‘రాధే శ్యామ్’ విడుదలవుతుంది. ఏప్రిల్ 1 నుండి ఖచ్చితంగా అంతా ‘రాధే శ్యామ్‌’తో ప్రేమలో పడిపోతారు. మంచి ప్రేమకథ. అందరూ చూసి ఎంజాయ్ చేయండి.. అని కోరారు. కాగా.. గోపీ కృష్ణ మూవీస్, యూవీ క్రియేష‌న్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి వంశీ, ప్రమోద్, ప్రసీధ నిర్మాతలు.



Updated Date - 2022-03-28T23:04:26+05:30 IST