Prabhas: ఆ బాలీవుడ్ భామతో రిలేషన్షిప్లో ఉన్నాడా?
ABN , First Publish Date - 2022-09-18T16:49:16+05:30 IST
ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ‘బాహుబలి(Bahubali)’ సినిమాతో పాన్ ఇండియా స్టార్గా మారిన టాలీవుడ్ నటుడు ప్రభాస్..
టాలీవుడ్ టాప్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ‘బాహుబలి(Bahubali)’ సినిమాతో పాన్ ఇండియా స్టార్గా మారిన టాలీవుడ్ నటుడు ప్రభాస్ (Prabhas). అనంతరం ఆయన అన్ని పాన్ ఇండియా చిత్రాలే చేస్తున్నాడు. అయితే.. ‘బాహుబలి 2’ తర్వాత ప్రభాస్ చేసిన ‘సాహో’, ‘రాధేశ్యామ్’ అనుకున్న ఫలితాన్ని ఇవ్వలేదు. ఈ తరుణంలో తర్వాత వచ్చే సినిమాలపై ప్రభాస్ భారీ ఆశలు పెట్టుకున్నాడు. అందులో.. దేశవ్యాప్తంగా ఆయన అభిమానులు ఎదురుచూస్తున్న మూవీ ‘ఆదిపురుష్(Adipurush)’. రామాయణ గాథ ఆధారంగా తెరెకెక్కిన ఈ చిత్రంలో డార్లింగ్కి జంటగా కృతిసనన్ (Kriti Sanon) నటించింది. గత కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ షూటింగ్ గుమ్మడికాయ కొట్టేసిన చిత్రబృందం పోస్ట్ ప్రొడక్షన్లో బిజీగా ఉంది.
ఈ తరుణంలో ‘ఆదిపురుష్’ జంటైన ప్రభాస్, కృతి సనన్ రిలేషన్షిప్లో ఉన్నారని బాలీవుడ్ సర్కిల్లో క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతోంది. వీరిద్దరి మధ్య ఈ సినిమా షూటింగ్ సమయంలో మంచి బంధం ఏర్పడిందని, అది షూటింగ్ పూర్తైన తర్వాత కూడా కొనసాగుతోందని ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించి ఓ మీడియా సంస్థకి విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందినట్లు తెలుస్తోంది.
ఆ సోర్స్ ప్రకారం.. ‘కొన్ని నెలల క్రితమే సినిమా షూటింగ్ పూర్తైనప్పటికీ.. వారి బంధం ఇప్పటికీ చెక్కుచెదరలేదు. ప్రతి రోజు కాల్ లేదా మేస్సేజ్ ద్వారా ఒకరినొకరు పలకరించుకుంటూనే ఉన్నారు. అది చూస్తే ఒకరిపై ఇంకొకరికి ఫిలింగ్స్ ఉన్నాయని అర్థమవుతోంది. అయితే.. ఈ నటులు ఇద్దరూ ప్రేమలో ఉన్నారని చెప్పడం చాలా తొందరపాటు అవుతుంది. సహనటులు అన్న తర్వాత సినిమాల షూటింగ్లో లేదా కలిసి ప్రమోట్ చేస్తున్నప్పుడు కూడా కనెక్ట్ అవ్వడం సర్వసాధారణం. కానీ కృతి, ప్రభాస్ కొంచెం భిన్నంగా ఉన్నారు. వారిద్దరికీ ఒకరితో ఒకరికి బలమైన అనుబంధం ఉంది. నిజమేంటో త్వరలోనే తెలిసే అవకాశం ఉంది’ అని చెప్పుకొచ్చారు. అయితే.. వివాదాలకు, పుకార్లకి చాలా దూరంగా ఉండే ప్రభాస్ ఈ రూమర్స్పై స్పందిస్తాడో లేదో చూడాలి మరి.
కాగా.. ‘ఆదిపురుష్’లో ప్రభాస్ రాముడిగా నటించగా.. సీత పాత్రలో కృతి నటించింది. ఈ సినిమాకి ఓం రౌత్ దర్శకత్వం వహించగా.. రావణుడి పాత్రలో సైఫ్ అలీఖాన్ నటించాడు. కాగా.. ఈ మూవీ సంక్రాంతి సందర్భంగా వచ్చే ఏడాది విడుదల చేసేందుకు చిత్రబృందం సిద్ధమవుతోంది. భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రంపై ప్రభాస్ భారీ ఆశలే పెట్టుకున్నాడు.