ఇంకా చికిత్స తీసుకుంటున్నాను... నన్ను ఎవరైనా పెళ్లి చేసుకుంటారని, నేను అనుకోవడం లేదు: పూనమ్ పాండే

ABN , First Publish Date - 2022-02-27T23:32:22+05:30 IST

బీ టౌన్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ‘లాక్‌ అప్’ రియాలిటీ షోకి

ఇంకా చికిత్స తీసుకుంటున్నాను... నన్ను ఎవరైనా పెళ్లి చేసుకుంటారని, నేను అనుకోవడం లేదు: పూనమ్ పాండే

బీ టౌన్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ‘లాక్‌ అప్’ రియాలిటీ షోకి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఏక్తా కపూర్ ఈ షోకు నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఈ షోలో బాలీవుడ్ బాంబ్ పూనమ్ పాండే పాల్గొననుంది. ఇప్పటికే ఆమెకు సంబంధించిన ప్రొమోను విడుదల చేశారు. తాజాగా ఆమె మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను అభిమానులకు తెలిపింది. 


పూనమ్ పాండే కొన్ని రోజుల క్రితమే తన మాజీ భర్త సామ్ బాంబేపై ఆరోపణలు గుప్పించి వార్తల్లోకెక్కింది. సామ్ బాంబేతో రిలేషన్ షిప్‌లో ఉన్నప్పుడు అనేక ఆటు, పోట్లు ఎదుర్కొన్నానని చెప్పింది. దీంతో తన మానసిక పరిస్థితి దెబ్బతిందని వెల్లడించింది. సామ్‌తో విడిపోతున్నానని తెలపగానే అందరూ పబ్లిసిటీ స్టంట్ అనుకున్నారని పేర్కొంది. ఆ విషయం ఎంతగానో బాధించిందని స్పష్టం చేసింది. తన గురించి ఈ విధంగా మాట్లాడే స్వేచ్ఛ తానే ఇచ్చాననే విషయం అర్థమైందని వివరించింది. 


ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నానని పూనమ్ చెప్పింది. ‘‘నా జీవితంలో పరిపూర్ణమైన ప్రేమను వెతకడానికి ప్రయత్నించాను. నాకు బ్రేకప్ చేసుకోవడం ఇష్టం లేదు. ప్రస్తుతం నన్ను ఎవరైనా పెళ్లి చేసుకుంటారని నేను అనుకోవడం లేదు. గతంలో నాకు వివాహం అంటేనే భయం ఉండేది. కానీ, ఆ సమయంలో అది సరైనది అనుకుని ఏడడుగులు వేశాను. నేను అనుకున్నట్టుగా జీవితంలో అన్ని విషయాలు జరగలేదు. దీంతో విడాకులు తీసుకొవాల్సి వచ్చింది. నా మానస్థిక పరిస్థితి దెబ్బతింది. శారీరకంగా కూడా అలసిపోయాను. పలుమార్లు ఆస్పత్రికి వెళ్లాల్సి వచ్చింది. ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నాను. కొంచెం పరిస్థితి మెరుగుపడింది’’ అని పూనమ్ పాండే చెప్పింది.

Updated Date - 2022-02-27T23:32:22+05:30 IST