Pooja Hegde ఆ స్టార్ హీరోని ‘ఆంటీ’ అంటుందట!
ABN , First Publish Date - 2022-03-19T02:30:26+05:30 IST
టాలీవుడ్ ప్రేక్షకుల్ని ‘రాధేశ్యామ్’తో పలకరించిన రావిషింగ్ బ్యూటీ పూజా హెగ్డే బాలీవుడ్లోనూ బిగ్ రిలీజ్కి రెడీ అవుతోంది. రోహిత్ శెట్టి దర్శకత్వంలో రూపొందిన కామెడి ఎంటర్టైనర్ ‘సర్కస్’ త్వరలో ఆడియన్స్ ముందుకు రానుంది. అయితే, తొలి సారి బీ-టౌన్ ఎనర్జిటిక్ స్టార్ రణవీర్తో జోడీ కట్టిన పూజా...
టాలీవుడ్ ప్రేక్షకుల్ని ‘రాధేశ్యామ్’తో పలకరించిన రావిషింగ్ బ్యూటీ పూజా హెగ్డే బాలీవుడ్లోనూ బిగ్ రిలీజ్కి రెడీ అవుతోంది. రోహిత్ శెట్టి దర్శకత్వంలో రూపొందిన కామెడి ఎంటర్టైనర్ ‘సర్కస్’ త్వరలో ఆడియన్స్ ముందుకు రానుంది. అయితే, తొలి సారి బీ-టౌన్ ఎనర్జిటిక్ స్టార్ రణవీర్తో జోడీ కట్టిన పూజా అతడి గురించి తన అభిప్రాయాన్ని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. రణవీర్ని తాను ‘ఆంటీ’ అంటానంటూ ఆసక్తికర కామెంట్ చేసింది...
రణవీర్ సింగ్ అంటే ‘ఫుల్ ఎంటర్టైన్మెంట్’ అంటోంది ‘బుట్ట బొమ్మ’. ‘‘నేను తనని ‘పమ్మీ ఆంటీ’ అంటాను’’ అని కూడా చెబుతోంది. అలా ఎందుకు పిలుస్తుందో కారణం కూడా వివరించింది అందాల ‘అరవింద’. ‘‘రణవీర్ ఎక్కడ ఉంటే అక్కడంతా సందడే. అతను ప్రతీ ఒక్కర్నీ అదే పనిగా గమనిస్తూ ఉంటాడు...’’ అంది డస్కీ బ్యూటీ. అక్కడితో ఆగని ‘సర్కస్’ సుందరి... సినిమాలో తాము చూడముచ్చటైన జంటగా కనిపిస్తామని ధీమాగా చెబుతోంది. చూడాలి మరి, ‘రాధేశ్యామ్’ ఆశించిన మేర బాక్సాఫీస్ రిజల్ట్ సాధించని నేపథ్యంలో... రోహిత్ శెట్టి లాంటి కమర్షియల్ డైరెక్టర్ రూపొందించిన ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్ ‘సర్కస్’... పూజా హెగ్డేకి ఎలాంటి ఫలితం సాధించి పెడుతుందో...