‘మా నీళ్ల ట్యాంక్’కు హీరోయిన్ Pooja Hegde సపోర్ట్
ABN , First Publish Date - 2022-07-09T02:40:35+05:30 IST
టాలీవుడ్ హీరో సుశాంత్ OTT అరంగేట్రం చేసిన ‘మా నీళ్ల ట్యాంక్’ వెబ్ సిరీస్.. ఈ నెల 15 నుండి జీ5లో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ వెబ్ సిరీస్కు స్టార్ హీరోయిన్
టాలీవుడ్ హీరో సుశాంత్ OTT అరంగేట్రం చేసిన ‘మా నీళ్ల ట్యాంక్’ వెబ్ సిరీస్.. ఈ నెల 15 నుండి జీ5లో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ వెబ్ సిరీస్కు స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే సపోర్ట్ లభించింది. ఈ సిరీస్ ట్రైలర్ను పూజా విడుదల చేసి, యూనిట్కు శుభాకాంక్షలు తెలిపారు. 8 ఎపిసోడ్లతో ఒక ఫీల్ గుడ్ పల్లెటూరి నాటకంగా ఈ సిరీస్ రూపొందుతోంది. లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో రొమాంటిక్ కామెడీగా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ ఎంతో రిఫ్రెసింగ్గా ఉంటుందని జీ5 యాజమాన్యం తెలుపుతోంది. నటి ప్రియా ఆనంద్ 10 సంవత్సరాల విరామం తర్వాత ఈ సిరీస్తో తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది.
ట్రైలర్ విషయానికి వస్తే.. చిన్న-పెద్ద సమస్యలను ప్రస్తావిస్తూ.. ప్రత్యేకమైన యాసతో పోలీసు అవతారంలో సుశాంత్ని పరిచయం చేస్తూ ట్రైలర్ ప్రారంభమైంది. సురేఖ (ప్రియా ఆనంద్) తన ప్రతిపాదనను అంగీకరించకపోతే ఆత్మహత్య చేసుకుంటానని సుదర్శన్ పాత్ర బెదిరించడం, తద్వారా వచ్చే కామెడీ ఆసక్తికరంగా ఉంది. మాంటేజ్ పాట సినిమాటిక్ టచ్ ఇస్తుంది. ఇందులో సురేఖ పాత్రతో పాటు నటించిన వారంతా పాత్రలకు పర్ఫెక్ట్గా సెట్ అయ్యారు. అలాగే ఫన్నీ ఎలిమెంట్స్ కూడా ఈ సిరీస్పై ఇంట్రస్ట్ని క్రియేట్ చేస్తున్నాయి.
ఈ ట్రైలర్ విడుదల అనంతరం ZEE5 ఇండియా చీఫ్ బిజినెస్ ఆఫీసర్ మనీష్ కల్రా మాట్లాడుతూ.. “మా వీక్షకులకు ఉత్తమమైన కంటెంట్ను అందించడంపై మేము దృష్టి పెడుతున్నాము. ఈ నెల15న విడుదల కాబోతోన్న తెలుగు ఒరిజినల్ ‘మా నీళ్ల ట్యాంక్’ ట్రైలర్ అందరికీ నచ్చే ఉంటుందని భావిస్తున్నాము. ఇంతకుముందు సుశాంత్ పాత్ర ప్రోమోను నేచురల్ స్టార్ నానిగారు, ప్రియా ఆనంద్ పాత్ర ప్రోమోను దర్శకుడు విక్రమ్ కె కుమార్గారు ఆవిష్కరించారు. ఇప్పుడు ట్రైలర్ విడుదల చేసిన పూజా హెగ్డేగారు విడుదల చేశారు. అందరికీ ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని కథనాలతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న జీ5 ప్రేక్షకులకు అసాధారణమైన వినోదాన్ని, కొత్తదనాన్ని అందించడంకోసం మేము ఎల్లప్పుడూ ముందుంటామని తెలియజేస్తున్నాము..’’ అని తెలిపారు.