బీచ్ పక్కన పుట్టిన రోజు వేడుకలు జరుపుతోన్న పూజా హెగ్డే.. ఎవరి కోసమో తెలుసా..
ABN , First Publish Date - 2022-02-13T02:47:56+05:30 IST
దక్షిణాదిలోనే కాకుండా బాలీవుడ్లోనూ వరుస సినిమాల చేస్తూ ఫుల్ బిజీగా ఉన్న నటి పూజా
దక్షిణాదిలోనే కాకుండా బాలీవుడ్లోనూ వరుస సినిమాల చేస్తూ ఫుల్ బిజీగా ఉన్న నటి పూజా హెగ్డే. షూటింగ్ల నుంచి బ్రేక్ తీసుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తోంది. గతంలో అనేక సార్లు వెకేషన్ని గడపడానికి ఆమె వెళ్లింది. కానీ, ఈ ట్రిప్ ఆమెకు చాలా స్పెషల్. ఎందుకంటే, అమ్మ పుట్టిన రోజు వేడుకలను ఈ వెకేషన్లోనే మన బుట్ట బొమ్మ సెలెబ్రేట్ చేసింది. తన తల్లికి మరపురాని గుర్తులను మిగిల్చింది. సముద్ర తీరాన సూర్యాస్తమయ సమయాన విందు భోజనాన్ని కూడా ఏర్పాటు చేసింది.
పూజ ఈ ఫొటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ఈ ఫొటోల కింద క్యాప్షన్ కూడా ఇచ్చింది. ‘‘టేబుల్ సిద్ధమైంది. సూర్యాస్తమయం అద్భుతంగా ఉంది. బీచ్ పక్కన కూర్చొని మా అమ్మ పుట్టినరోజు వేడుకలను జరిపాం. హ్యాపీ బర్త్డే మామ్. ఈ పుట్టినరోజు నీకు స్పెషల్గా మిగిలిపోతుందని ఆశిస్తున్నాను’’ అంటూ పూజ క్యాప్షన్ ఇచ్చింది.
ప్రస్తుతం పూజ నటించిన ‘రాధేశ్యామ్’, ‘బీస్ట్’ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. మహేశ్ బాబు సరసన కూడా ఓ మూవీలో ఆమె నటిస్తోంది. ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రాన్ని పూజ కార్యక్రమాలతో ఈ మధ్యనే ప్రారంభించారు.