లెస్బియన్ యాడ్ను ఆపేసిన Dabur.. విమర్శించిన Pooja Bhatt!
ABN , First Publish Date - 2021-10-27T16:44:09+05:30 IST
కర్వాచౌత్ పండగ సందర్భంగా ప్రముఖ ఎఫ్ఎమ్సీజీ సంస్థ డాబర్ రూపొందించిన యాడ్ వివాదాస్పదంగా మారింది.
కర్వాచౌత్ పండగ సందర్భంగా ప్రముఖ ఎఫ్ఎమ్సీజీ సంస్థ డాబర్ రూపొందించిన యాడ్ వివాదాస్పదంగా మారింది. తన ఉత్పత్తి అయిన షేష్ క్రీమ్ గోల్డ్ బీచ్ను ప్రమోట్ చేస్తూ డాబర్ ఇటీవల ఓ యాడ్ను ప్రసారం చేసింది. అయితే అది లెస్బియన్ నేపథ్యంలో ఉండడంతో విమర్శలు తలెత్తాయి. దీంతో కంపెనీ దిద్దుబాటు చర్యలకు దిగింది. యాడ్ని అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల నుంచి తొలగించినట్లు సంస్థ తెలిపింది. ఉద్దేశ పూర్వకంగా చేయని ఈ చర్య వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే బేషరతుగా క్షమాపణ చెబుతున్నామని ట్విటర్ ద్వారా తెలిపింది.
డాబర్ సంస్థ తన యాడ్ను ఉపసంహరించుకోవడం పట్ల బాలీవుడ్ నటి పూజా భట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. `ప్రజాస్వామ్యానికి తల్లి లాంటి దేశంలో ఇలాంటి వాటిని బ్యాన్ చేస్తూ ఉండండి. డాబర్ లాంటి దిగ్గజ సంస్థ ఆ యాడ్కు మద్దతుగా నిలవకుండా ఉపసంహరించుకోవడం జాలి కలిగిస్తోంది. సాధారణంగా నేను ఫెయిర్నెస్ క్రీమ్లను ఎండార్స్ చేయడానికి ఇష్టపడను. అయినా ఈ యాడ్ ఒక వర్గం చేరికను గొప్పగా చూపించడంతో నాకు నచ్చింది. ఇప్పుడు ఆ యాడ్ను ఉపసంహరించుకోవడం ఎందుకు?` అని పూజ ప్రశ్నించింది.