Ponniyin Selvan: ఆల్ ‌టైమ్ రికార్డు నెలకొల్పిన మణిరత్నం మూవీ.. ఆ ఫీట్ సాధించిన ఫస్ట్ కోలీవుడ్ సినిమా ఇదే..

ABN , First Publish Date - 2022-10-17T15:17:36+05:30 IST

మణిరత్నం (ManiRatnam) డ్రీమ్ ప్రాజెక్ట్ ‘పొన్నియిన్ సెల్వన్’ (Ponniyin Selvan) పలు రికార్డులు బద్దలు కొడుతూ దూసుకెళుతోంది...

Ponniyin Selvan: ఆల్ ‌టైమ్ రికార్డు నెలకొల్పిన మణిరత్నం మూవీ.. ఆ ఫీట్ సాధించిన ఫస్ట్ కోలీవుడ్ సినిమా ఇదే..

మణిరత్నం (ManiRatnam) డ్రీమ్ ప్రాజెక్ట్ ‘పొన్నియిన్ సెల్వన్’ (Ponniyin Selvan) పలు రికార్డులు బద్దలు కొడుతూ దూసుకెళుతోంది. ఇప్పటికే చాలా చోట్ల అత్యధిక కలెక్షన్లు సాధించిన తమిళ చిత్రంగా నిలిచింది. ఈ మూవీ తాజాగా మరో ఫీట్‌ని సాధించింది. ఇప్పటి వరకూ తమిళనాడు (Tamil Nadu)లో రూ.200 కోట్ల కలెక్షన్లు సాధించిన మూవీ ఏది లేదు. ఆ ఫీట్‌ని తాజాగా ‘పొన్నియిన్ సెల్వన్’ సాధించింది.


పొన్నియిన్ సెల్వన్ వసూళ్ల గురించి తెలుపుతూ ప్రముఖ ట్రేడ్ ఎనలిస్ట్ మనోబాలా విజయబాలన్ ట్వీట్ చేశాడు. అందులో.. ‘17వ రోజుకి తమిళనాడు బాక్సాఫీస్ వద్ద పొన్నియిన్ సెల్వన్ రూ. 200 కోట్ల మైలురాయిని అధిగమించింది. కోలీవుడ్ చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి చిత్రం ఇదే’ అని రాసుకొచ్చాడు.


అయితే.. ఈ మూవీ ఇంతుకుముందే గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద కమల్ హాసన్, ఫహద్ ఫాసిల్, విజయ్ సేతుపతి నటించిన ‘విక్రమ్’ (Vikram)  జీవితకాల వసూళ్లను దాటి.. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు చేసిన రెండో తమిళ చిత్రంగా నిలిచింది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ రూ.410 కోట్లు రాబట్టగా.. మణిరత్నం దర్శకత్వం వహించిన ‘పీఎస్ 1’ రూ.435 కోట్లు కొల్లగొట్టింది. కాగా.. రూ.650 కోట్లకు పైగా కలెక్షన్లతో రజనీకాంత్, శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన ‘రోబో 2.0’ మొదటి స్థానంలో ఉంది. ఈ మూవీలో ఐశ్వర్య రాయ్, త్రిష, చియాన్ విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్య లక్ష్మీ, శోభితా ధూళిపాళ తదితరులు కీలక పాత్రలు పోషించారు.



Updated Date - 2022-10-17T15:17:36+05:30 IST