కష్టకాలంలోనే వ్యక్తి నిజస్వరూపం తెలుస్తుందంటూ.. షారూఖ్ ఖాన్ను ఉద్దేశించి ట్వీట్ చేసిన బాలీవుడ్ నటి
ABN , First Publish Date - 2021-10-31T19:53:38+05:30 IST
షారూఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో చిక్కుకుని 28రోజుల అనంతరం బెయిల్పై జైలు నుంచి బయటకు వచ్చాడు. క్రూయిజ్ షిప్లో డ్రగ్స్ ఉపయోగించారని నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ)
షారూఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో చిక్కుకుని 28రోజుల అనంతరం బెయిల్పై జైలు నుంచి బయటకు వచ్చాడు. క్రూయిజ్ షిప్లో డ్రగ్స్ ఉపయోగించారని నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు ఆర్యన్ ఖాన్, అర్బాజ్ మర్చంట్ సహా కొంత మందిని తమ అదుపులోకి తీసుకున్నారు. ఆర్యన్ బెయిల్కు దరఖాస్తు చేసుకోగా అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాలతో అతడికి సంబంధాలున్నాయని పేర్కొంటూ ప్రత్యేక కోర్టు ఆ పిటిషన్ను తిరస్కరించింది. అతడికి ముంబై హైకోర్టు బెయిల్ను మంజూరు చేయడంతో అర్థర్ రోడ్డు జైలు నుంచి కింగ్ ఖాన్ తనయుడు అక్టోబర్ 30న విడుదలయ్యాడు.
షారూఖ్ తన తనయుడిని తీసుకుని మన్నత్కు చేరుకోగా వేలాదిమంది అభిమానులు అతడి నివాసం వద్ద స్వాగతం పలికారు. ఈ కష్టకాలంలో బాలీవుడ్ బాద్షా వ్యవహరించిన తీరును ఉద్దేశిస్తూ అలనాటి బాలీవుడ్ నటి ఊర్మిళ మంతోడ్కర్ ట్వీట్ చేశారు. ‘‘ కష్టకాలంలోనే వ్యక్తి నిజస్వరూపం తెలుస్తుంది. ఈ ఒత్తిడి సమయంలోను అతడు ఇతరుల పట్ల గౌరవం చూపాడు. పరిపక్వతతో వ్యవహరించాడు. నీ లాంటి కొలీగ్ ఉన్నందుకు నేను గర్వపడుతున్నాను. దేవుని దీవెనలు ఎల్లప్పుడు నీకు ఉంటాయి ’’ అని ఊర్మిళ మంతోడ్కర్ ట్వీట్ చేసింది.
హృతిక్ రోషన్, సోమీ అలీ, రవీనా టండన్, విశాల్ దడ్లానీ తదితరులు డ్రగ్స్ కేసులో ఆర్యన్కు మద్దతుగా నిలిచారు. ఉత్తర్ ప్రదేశ్లోని లఖీంపూర్ ఘటనను దారి మళ్లించడానికే ఆర్యన్ను ఇరిక్కించారని బాలీవుడ్ సెలెబ్రిటీలు ఆరోపించారు.