అలాంటి మహిళలను అరెస్ట్ చేయాలి: దర్శకుడు సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2022-01-06T03:28:16+05:30 IST

ఈ చిత్రం మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, వేధింపుల గురించి వివరించే సినిమా. పురుషుల వల్ల మహిళలకు వేధింపులు ఎక్కువవుతున్నాయని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. టిక్‌ టాక్‌ వీడియోల్లో ఈ మహిళలు చేస్తున్న అరాచకాలు..

అలాంటి మహిళలను అరెస్ట్ చేయాలి: దర్శకుడు సంచలన వ్యాఖ్యలు

టిక్‌టాక్‌ వంటి షేరింగ్‌ యాప్‌లలో అసభ్యకర, అశ్లీల వీడియోలను షేర్‌ చేసే మహిళలను గుర్తించి అరెస్టు చేయాలని ప్రముఖ సినీ దర్శకుడు పేరరసు కోరారు. గత ప్రభుత్వ హయాంలో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పొల్లాచ్చి ఘటన కేసు ఏమైందని ఆయన ప్రశ్నించారు. విద్యార్థినుల పట్ల అసభ్యంగా నడుచుకునే ఉపాధ్యాయులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్‌ చేశారు. రెయిన్‌బో ప్రొడక్షన్స్‌ బ్యానరులో నిర్మాత వరదరాజ్‌ నిర్మించిన ‘పెణ్‌ విలై వెరుం రూ.999 మట్టుమే’ చిత్ర ఆడియో, ట్రైలర్‌ రిలీజ్‌ కార్యక్రమంలో తాజాగా చెన్నై నగరంలో జరిగింది. ఈ కార్యక్రమానికి దర్శకుడు పేరరసు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.


ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ఈ చిత్రం మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, వేధింపుల గురించి వివరించే సినిమా. పురుషుల వల్ల మహిళలకు వేధింపులు ఎక్కువవుతున్నాయని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. టిక్‌ టాక్‌ వీడియోల్లో ఈ మహిళలు చేస్తున్న అరాచకాలు భరించలేకపోతున్నాం. కొందరు మహిళలు దిగజారి మాట్లాడుతున్న మాటలు, చేస్తున్న వ్యాఖ్యలు వినలేకపోతున్నాం. ఇలాంటి వారిని గుర్తించి అరెస్ట్ చేయాలి. దేశ సంస్కృతీ సంప్రదాయాలు మంటగలిసి పోవడానికి కారణం మొబైల్‌ ఫోన్లే. అందువల్ల పిల్లల చేతికి తల్లిదండ్రులు ఫోన్లు ఇవ్వొద్దని విఙ్ఞప్తి చేస్తున్నాను. సినిమా ఒక వినోద సాధనం. దానిమూలంగా ప్రేక్షకులను సంతోషపరచాలి. ఈ చిత్రం ప్రతి ఒక్క మహిళను ఆలోచింపజేసే విధంగా ఉంది’’ అని పేరరసు అన్నారు. ఈ చిత్రంలో రాజ్‌కమల్‌, మధు, శ్వేతాపండిట్‌ నటించగా.. వరదరాజ్‌ స్వయంగా నిర్మించి దర్శకత్వం వహించారు.

Updated Date - 2022-01-06T03:28:16+05:30 IST