Pawan Kalyan: సురేందర్ రెడ్డితో మూవీ ఆగిపోయిందా..? ఇదిగో క్లారిటీ
ABN , First Publish Date - 2022-09-02T18:30:20+05:30 IST
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి (Surender Reddy) కాంబినేషన్లో రెండేళ్ల క్రితం అఫీషియల్గా ఓ మూవీని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి (Surender Reddy) కాంబినేషన్లో రెండేళ్ల క్రితం అఫీషియల్గా ఓ మూవీని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, ప్రకటన తప్ప ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్డేట్స్ ఇప్పటి వరకు రాలేదు. మూడేళ్ళ తర్వాత వకీల్ సాబ్ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చిన పవన్..వరుసగా కొత్త ప్రాజెక్ట్స్ కమిటయ్యారు. వాటిలో ఒక్క భీమ్లా నాయక్ తప్ప మిగిలినవన్నీ అలానే ఉన్నాయి. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు (Harihara Veeramallu) షూటింగ్ దశలో ఉంది.
అలాగే, ఎస్ ఆర్ టీ ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థలో పవన్ - సురేందర్ రెడ్డి సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందో తెలియలేదు. ప్రాజెక్ట్ను ప్రకటించడం తప్ప ఎలాంటి అప్డేట్ లేకపోవడం, దానికి తోడు పవన్ రాజకీయాలలో ఎక్కువ సమయం కేటాయించడం వల్ల ఈ సినిమా ఆగిపోయిందనే వార్తలు వచ్చాయి. కానీ, దీనికి సంబంధించిన తాజా అప్డేట్ ఇచ్చి మేకర్స్ సర్ప్రైజ్ ఇచ్చారు. ఈరోజు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత రామ్ తాళ్లూరి (Ram Talluri)ని ఓ నెటిజన్ ఈ ప్రాజెక్ట్పై అప్డేట్ ఇవ్వమని అడిగాడు.
దానికి స్పందించిన నిర్మాత.. "ఈ ప్రాజెక్ట్ ఖచ్చితంగా వుందని సురేందర్ రెడ్డి 'ఏజెంట్' మూవీ పూర్తి చేశాక మన సినిమా ప్రారంభం అవుతుంది"..అని క్లారిటీ ఇచ్చారు. సో సురేందర్ రెడ్డి, అఖిల్ కాంబోలో రూపొందుతున్న ఏజెంట్ మూవీ పూర్తయ్యాక పవన్ కళ్యాణ్తో సినిమాను సెట్స్పైకి తీసుకురాబోతున్నట్టు కన్ఫర్మ్ అయింది. ఈ సినిమాకు కథ వక్కంతం వంశీ అందిస్తున్నారు. కాగా, తాజాగా పవన్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా హరిహర వీరమల్లు నుంచి టీజర్ వచ్చి యూట్యూబ్లో ట్రెండ్ అవుతోంది.