‘భీమ్లా నాయక్’ సెన్సార్ పూర్తి.. ఇక శివతాండవమే..!

ABN , First Publish Date - 2022-02-19T02:34:21+05:30 IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కాంబినేషన్‌లో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మితమవుతోన్న చిత్రం ‘భీమ్లా నాయక్’. ఈ సినిమాపై ఎటువంటి అంచనాలు ఉన్నాయో తెలియంది కాదు. వాస్తవానికి ఈ చిత్రం సంక్రాంతికి

‘భీమ్లా నాయక్’ సెన్సార్ పూర్తి.. ఇక శివతాండవమే..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కాంబినేషన్‌లో సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మితమవుతోన్న చిత్రం ‘భీమ్లా నాయక్’. ఈ సినిమాపై ఎటువంటి అంచనాలు ఉన్నాయో తెలియంది కాదు. వాస్తవానికి ఈ చిత్రం సంక్రాంతికి ముందే విడుదల కావాలి. ఎందుకు, ఎలా? వాయిదా పడిందో అందరికీ తెలిసిందే. ఆ తర్వాత రెండు విడుదల తేదీలు ఈ చిత్రానికి కేటాయించారు. అందులో ఒకటి ఫిబ్రవరి 25 కాగా, రెండోది ఏప్రిల్ 01. అయితే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 25నే విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. తాజాగా చిత్ర సెన్సార్ కార్యక్రమాలు కూడా ముగిశాయి.


సెన్సార్ నుండి ఈ చిత్రానికి యు బై ఏ సర్టిఫికేట్ లభించింది. సెన్సార్ కూడా క్లియర్ అయింది కాబట్టి.. ఇక వాయిదాలు పడే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో ఉండదనే అనుకోవచ్చు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా.. ఈసారి థియేటర్లలో శివతాండవం పక్కా అన్నట్లుగా మేకర్స్ కూడా అడుగులు వేస్తున్నారు. అభిమానుల వైపు నుండి కూడా ఈ చిత్రానికి పూర్తి స్థాయిలో మద్దతు లభిస్తుండటంతో.. ‘భీమ్లా నాయక్’ ప్రభంజనం బాక్సాఫీస్ వద్ద గట్టిగా ఉండబోతుందనేది మాత్రం సుస్పష్టమవుతోంది. నిత్యా మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ సంభాషణలు, స్క్రీన్‌ప్లే సమకూర్చగా ఎస్. ఎస్. థమన్ సంగీతం అందించారు.



Updated Date - 2022-02-19T02:34:21+05:30 IST