Pawan kalyan : సిరివెన్నెల అక్షరాలు నిత్య చైతన్య కిరణాలు!

ABN , First Publish Date - 2022-05-23T21:53:36+05:30 IST

‘‘కవి తన రచనల ద్వారా అమరత్వం పొందుతాడు. తను భౌతికంగా లేకపోయినా సమాజానికి అందించిన అక్షర కిరణాల ద్వారా స్ఫూర్తినిస్తాడు. పంచభూతాలలో కలసిపోయినా రాబోయే తరానికి దిశానిర్దేశం చేస్తూనే ఉంటారు. అలాంటి ఒక గొప్ప కవి శ్రీ ‘సిరివెన్నెల’ సీతారామ శాస్ర్తి’’ అని ఆయన్ను జ్ఞప్తికి తెచ్చుకున్నారు పవన్‌కల్యాణ్‌.

Pawan kalyan : సిరివెన్నెల అక్షరాలు నిత్య చైతన్య కిరణాలు!

‘‘కవి తన రచనల ద్వారా అమరత్వం పొందుతాడు. తను భౌతికంగా లేకపోయినా సమాజానికి అందించిన అక్షర కిరణాల ద్వారా స్ఫూర్తినిస్తాడు. పంచభూతాలలో కలసిపోయినా రాబోయే తరానికి దిశానిర్దేశం చేస్తూనే ఉంటారు. అలాంటి ఒక గొప్ప కవి శ్రీ ‘సిరివెన్నెల’ సీతారామ శాస్ర్తి’’ (Sirivennela seetaramasastri)అని ఆయన్ను జ్ఞప్తికి తెచ్చుకున్నారు Pawan kalyan పవన్‌కల్యాణ్‌. ఈ మేరకు ఆయన ఒక లేఖ విడుదల చేశారు. ‘‘సీతారామ శాస్ర్తి జయంతి సందర్భంగా విడుదలైన ‘సిరివెన్నెల సీతారామశాస్ర్తి సమగ్ర సాహిత్యం’ మొదటి సంపుటి చూశాక ఆ అక్షర తపస్విని మొదటిసారి ‘రుద్రవీణ’ (rudraveena)సినిమా సమయంలో కలిసిన సందర్భం గుర్తుకు వచ్చింది. అన్నయ్య చిరంజీవి గారు నటించిన ఈ సినిమాకు నాగబాబు అన్నయ్య నిర్మాతగా ఉన్న ఈ చిత్రానికి నేను సహ నిర్మాతగా ఉంటూ నిర్మాణంలో పాలుపంచుకొన్నాను. అప్పుడు శాస్ర్తి గారితో భేటీ ఆయ్యేవాణ్ణి. ఆ చిత్రంలో ‘చుట్టూపక్కల చూడరా చిన్నవాడా’ పాటలో చివరి చరణం ఇప్పటికీ నన్ను వెంటాడుతూనే ఉంటుంది. 

‘నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది. 

గర్వించే ఈ నీ బ్రతుకు ఈ సమాజమే మలిచింది

రుణం తీర్చు తరుణం వేస్త తప్పించుకుపోతున్నావా

తెప్ప తగలబెట్టేస్తావా ఏరు దాటగానే’ 

అనే ఈ పంక్తులు ఇప్పటికీ నా బాధ్యతను గుర్తు చేస్తూ ఉంటాయి. నన్ను నిలబెట్టిన ఈ సమాజానికి రుణం తీర్చుకోవడం నా విధిగా భావిస్తాను. జనసేన పార్టీ పక్షాన కౌలు రైతులకు భరోసా ఇచ్చి ఆర్థిక సాయం చేయడం కూడా నా బాధ్యతే! ‘మనకున్నది పదిమందికీ పంచాలి’ అది ప్రకృతి ధర్మం అనే విషయాన్నీ ‘రుద్రవీణ’లోని ‘తరలిరాద తనే వసంతం..’ పాటలో వినిపించారు. 

‘పంచే గుణమే పోతే – ప్రపంచమే శూన్యం

ఇది తెలియని మనుగడ కథ – దిశనెరుగని గమనము కద’ 

అనే పంక్తులలోని భావాన్ని అందరం తెలుసుకోవాలి.  ఏరు దాటాకా అవసరం తీరిందని తెప్ప తగలబెట్టే ఆలోచనలతో బాధ్యతాయుత స్థ్థానాల్లో ఉన్నవారు శాస్త్రిగారి సాహిత్యాన్ని చదివి అర్థం చేసుకోవాలి. ఆయన రచనలు అన్నింటిలోనూ కవిగా ఆయనలోని సామాజిక బాధ్యత కనిపిస్తుంది. సమాజానికీ బాధ్యతలు గుర్తు చేేస దృక్పథం అందులో నిక్షిప్తమై ఉంటుంది. ఆయన అక్షరాలు నిత్య చైతన్య కిరణాలు. శాస్ర్తి గారి రచనలలోని గాఢతను చెబుతూ కవిగా ఆయన్ని మరింత అర్థం చేసుకొనేలా చేశారు త్రివిక్రమ్‌ గారు. ‘సిరివెన్నెల సీతారామ శాస్ర్తి సమగ్ర సాహిత్యం అందిస్తున్న ‘తానా’ బృందానికి నా హృదయపూర్వక అభినందనలు’’ అని పవన్‌కల్యాణ్‌ (Pawankalyan )పేర్కొన్నారు. 






Updated Date - 2022-05-23T21:53:36+05:30 IST