Pawan kalyan: దేశమంతా దుమ్ము దులిపేస్తోంది!

ABN , First Publish Date - 2022-08-22T00:38:15+05:30 IST

ఎన్నో ఆటంకాలు, వాయిదాల అనంతరం విడుదలైన నిఖిల్‌ ‘కార్తికేయ–2’ చిత్రం ప్యాన్‌ దక్షిణాదిలోనే కాకుండా బాలీవుడ్‌లోనూ వసూళ్ల వర్షం కురిపిస్తోంది. బాలీవుడ్‌లో మొదటిరోజు 50 థియేటర్లతో మొదలైన ఈ చిత్రం ఆరో రోజుకి వెయ్యి థియేటర్‌లలో ప్రదర్శించబడింది. రెండోవారంలో రెట్టింపు థియేటర్లు దొరికాయని చిత్ర బృందం హర్షం వ్యక్తం చేస్తోంది

Pawan kalyan: దేశమంతా దుమ్ము దులిపేస్తోంది!

ఎన్నో ఆటంకాలు, వాయిదాల అనంతరం విడుదలైన నిఖిల్‌ ‘కార్తికేయ–2’ (Karthikeya 2)చిత్రం ప్యాన్‌ దక్షిణాదిలోనే కాకుండా బాలీవుడ్‌లోనూ వసూళ్ల వర్షం కురిపిస్తోంది. బాలీవుడ్‌లో మొదటిరోజు 50 థియేటర్లతో మొదలైన ఈ చిత్రం ఆరో రోజుకి వెయ్యి థియేటర్‌లలో ప్రదర్శించబడింది. రెండోవారంలో రెట్టింపు థియేటర్లు దొరికాయని చిత్ర బృందం హర్షం వ్యక్తం చేస్తోంది. ఈ సినిమా సక్సెస్‌ గురించి తెలుగు చిత్ర పరిశ్రమంతా గర్వంగా మాట్లాడుకుంటోంది. స్టార్‌ హీరోలు సైతం ‘కార్తికేయ’ టీమ్‌ను అభినందిస్తున్నారు. 


తాజాగా పవన్‌ కల్యాణ్‌ (pawan kalyan) ‘కార్తికేయ’ సినిమా గురించి మాట్లాడారు. ‘‘నేనెప్పుడూ మార్పు రావాలని కోరుకుంటా. నిఖిల్‌ అనే హీరో నటించి ‘కార్తికేయ–2’ సినిమా దేశమంతా దుమ్ము దులిపిపేస్తుంది’’ అని జనసేన పార్టీ మీటింగ్‌లో ఆయన చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. పవన్‌ మాట్లాడిన వీడియోను నిఖిల్‌ ట్విట్టర్‌లో షేర్‌ చేసి ‘‘ఆయన మాటల్లో.. సినిమా గురించీ, నా గురించి వినడం చాలా ఆనందంగా ఉంది. మీ మాటలకు చాలా కృతజ్ఞతలు సర్‌’’ అని నిఖిల్‌ ట్వీట్‌ చేశారు.  




Updated Date - 2022-08-22T00:38:15+05:30 IST