Pa.Ranjith: యువత ప్రతిభను ఉపయోగించుకుంటున్నా..
ABN , First Publish Date - 2022-08-24T19:51:21+05:30 IST
తాను ఏ ఒక్కరి ఎదుగుదలకు సాయపడటం లేదనీ, యువతలోని ప్రతిభ (టాలెంట్)ను మాత్రమే ఉపయోగించుకుంటున్నానని దర్శక నిర్మాత పా.రంజిత్ (Pa.Ranjith) పేర్కొన్నారు. ఆయన స్వీయ నిర్మాణ దర్శకత్వంలో రూపొందిన ‘నక్షత్రం నగర్గిరదు’
తాను ఏ ఒక్కరి ఎదుగుదలకు సహాయపడటం లేదనీ, యువతలోని ప్రతిభ (టాలెంట్)ను మాత్రమే ఉపయోగించుకుంటున్నానని దర్శక నిర్మాత పా.రంజిత్ (Pa.Ranjith) పేర్కొన్నారు. ఆయన స్వీయ నిర్మాణ దర్శకత్వంలో రూపొందిన ‘నక్షత్రం నగర్గిరదు’ ఆడియో, ట్రైలర్ రిలీజ్ కార్యక్రమం తాజాగా జరిగింది. ఈ కార్యక్రమానికి దర్శకుడు వెట్రిమారన్ (Vetrimaaran), వెంకట్ప్రభు (Venkat Prabhu), శశి, నిర్మాతలు కలైపులి ఎస్.థాను, ఙ్ఞానవేల్ రాజా, మనోజ్తో పాటు చిత్ర బృందం హాజరయ్యారు.
ఈ సందర్భంగా పా.రంజిత్ మాట్లాడుతూ.. ‘‘జైభీమ్’ అనే వార్త నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది. నేను ఏ ఒక్కరినీ పెద్దవారిని చేయడం లేదు. యువతలోని టాలెంట్ను మాత్రమే ప్రోత్సహిస్తూ, ఉపయోగించుకుంటున్నాను. ఇలాంటి వారితో పని చేయడం సంతోషంగా ఉంది. దర్శకుడు వెంకట్ ప్రభు వద్ద అనేక విషయాలు నేర్చుకున్నానన్నారు. చెన్నై 28’ సినిమా నాలోని టాలెంట్ వెలికి తీసింది. మన ఆలోచనకనుగుణంగా సినిమా తీయొచ్చన్న నమ్మకం ఏర్పడిందన్నారు. దర్శకుడు వెట్రిమారన్ మాట్లాడుతూ.. ‘‘అట్టకత్తి’ నుంచి ‘నక్షత్రం నగర్గిరదు’ వరకు పా.రంజిత్ సరికొత్త ట్రెండ్ సృష్టిస్తున్నారని కొనియాడారు.
మరో దర్శకుడు వెంకట్ ప్రభు మాట్లాడుతూ.. ‘రంజిత్లో ఎన్నో ఆలోచనలు నిక్షిప్తమైవున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే గురువును మించిన శిష్యుడు అనిపించుకుంటున్నారు’ అని ప్రశంసించారు. ఇతర అతిథితులు కూడా చిత్ర బృందానికి విషెస్ చెబుతూ, చిత్రం విజయం సాధించాలని ఆకాంక్షించారు. నీలం ప్రొడక్షన్స్, యాళ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో కాళిదాస్ జయరాం, దుషారా విజయన్, కలైయరసన్, డ్యాన్సింగ్ రోజ్ కబీర్ తదితరులు నటించారు. ఈ నెల 31వ తేదీన విడుదలకానుంది.