Vyjayanti movies: ప్యాన్ ఇండియా పిక్!
ABN , First Publish Date - 2022-06-27T22:14:38+05:30 IST
టాలీవుడ్లో 50 ఏళ్ల చరిత్ర ఉన్న నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్. అశ్వినీదత్ నిర్మాణంలో ఈ బ్యానర్ నుంచి ఎన్నో సూపర్హిట్ చిత్రాలొచ్చాయి. ప్రస్తుతం భారీ చిత్రాలతోపాటు, ట్రెండ్కు తగ్గ సిరీస్లు, సినిమాలు ఈ బ్యానర్ నుంచి వస్తున్నాయి. తాజాగా వైజయంతి మూవీస్ నూతన కార్యాలయం ప్రారంభోత్సవం హైదరాబాద్లో జరిగింది. ఈ వేడుకలో అమితాబ్ బచ్చన్, ప్రభాస్, కె.రాఘవేంద్రరావు, నాగ్అశ్విన్, ప్రశాంత్నీల్, నాని, దుల్కర్ సల్మాన్ పాల్గొన్నారు.
టాలీవుడ్లో 50 ఏళ్ల చరిత్ర ఉన్న నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్(Vyjayanti movies). అశ్వినీదత్ నిర్మాణంలో ఈ బ్యానర్ నుంచి ఎన్నో సూపర్హిట్ చిత్రాలొచ్చాయి. ప్రస్తుతం భారీ చిత్రాలతోపాటు, ట్రెండ్కు తగ్గ సిరీస్లు, సినిమాలు ఈ బ్యానర్ నుంచి వస్తున్నాయి. తాజాగా వైజయంతి మూవీస్ నూతన కార్యాలయం ప్రారంభోత్సవం హైదరాబాద్లో జరిగింది. ఈ వేడుకలో అమితాబ్ బచ్చన్(amitabh bachchan), ప్రభాస్(Prabhas), కె.రాఘవేంద్రరావు, (K raghavendrarao) నాగ్అశ్విన్, ప్రశాంత్నీల్, నాని, దుల్కర్ సల్మాన్ పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఓ ఫొటో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందులో ఉన్న సెలబ్రిటీలను చూసి నెటిజన్లు ‘ఇది ప్యాన్ ఇండియా పిక్’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
అయితే ఈ ఫొటోలో ఉన్న వారంతా వైజయంతీ బ్యానర్లో మంచి అనుబంధం ఉన్నవారే. కె. రాఘవేంద్రరావు ఈ బ్యానర్లో ఎన్నో హిట్ సినిమాలకు దర్శకత్వం వహించారు. నాని ‘ఎవడే సుబ్రహ్మణ్యం’, ‘కృష్ణార్జున యుద్ధం’ చిత్రాల్లో నటించారు. దుల్కర్ సల్మాన్ ‘మహానటి’తో విజయాన్ని అందుకున్నారు. తాజాగా ‘సీతారామం’ సినిమాలో నటిస్తున్నారు. ప్రస్తుతం వైజయంతీ బ్యానర్లో ప్రభాస్ హీరోగా ‘ప్రాజెక్ట్ కె’ తెరకెక్కుతోంది.ప్యాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకుడు. కీలక పాత్రలో బిగ్బీ అమితాబ్ బచ్చన్ నటిస్తున్నారు.