Bimbisara: తియ్యగా.. ఓ తేనే పలుకుల గీతం
ABN , First Publish Date - 2022-07-24T03:47:54+05:30 IST
‘ఓ తేనే పలుకుల అమ్మాయి.. నీ తీగ నడుములో సన్నాయి.. లాగిందే’ అని అందమైన రాజకుమారి పాత్రలో ఉన్న క్యాథరిన్ ట్రెసా (CatherIne Tresa)ను చూసి.. రాజు పాత్రలోని నందమూరి కళ్యాణ్ రామ్ కొంటెగా పాడుతుంటే.. దానికి బదులుగా ఆమె..
‘ఓ తేనే పలుకుల అమ్మాయి.. నీ తీగ నడుములో సన్నాయి.. లాగిందే’ అని అందమైన రాజకుమారి పాత్రలో ఉన్న క్యాథరిన్ ట్రెసా (CatherIne Tresa)ను చూసి.. రాజు పాత్రలోని నందమూరి కళ్యాణ్ రామ్ కొంటెగా పాడుతుంటే.. దానికి బదులుగా ఆమె ‘ఓ కోర మీసపు అబ్బాయి.. నీ ఓర చూపుల లల్లాయి.. బాగుందోయ్’ అంటూ.. అతనిలో చిలిపిదనాన్ని మరింతగా రెచ్చగొడుతుంది. తేనే పలుకుల అమ్మాయి, కోర మీసపు అబ్బాయిల మధ్య ఉన్న ప్రేమ వ్యవహారం ఏంటీ అనేది తెలియాలంటే.. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై హరికృష్ణ.కె నిర్మిస్తున్న ‘బింబిసార’ (Bimbisara) చిత్రం వచ్చే వరకు వేచి చూడక తప్పదు. కెరీర్ ప్రారంభం నుంచి వైవిధ్యమైన చిత్రాలలో నటిస్తూ హీరోగా తనదైన స్థానాన్ని సంపాదించుకున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్ (Kalyan Ram) టైటిల్ పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘బింబిసార’. ‘ఏ టైమ్ ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్’ అనేది ట్యాగ్ లైన్. వశిష్ఠ్ (Vassishta) ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఆగస్ట్ 5న ఈ చిత్రం గ్రాండ్ లెవల్లో విడుదల కాబోతోంది. చిత్ర ప్రమోషన్లో భాగంగా శనివారం చిత్రంలోని ‘ఓ తేనే పలుకుల అమ్మాయి’ (O Tene Palukula Ammayi) వీడియో సాంగ్ని మేకర్స్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
వరికుప్పల యాదగిరి (Varikuppala Yadagiri) ఈ పాటను రాయటంతో పాటు.. పాటకు అద్భుతమైన ట్యూన్ను కంపోజ్ చేశారు. హైమంత్ మహ్మద్, సత్య యామిని ఈ పాటను పాడారు. ఈ పాటను చూస్తుంటే.. చాలా కాలం తర్వాత ఓ చక్కని పాటను చూస్తున్న ఫీలింగ్ కలుగుతోంది. ఈ సినిమా విషయానికి వస్తే.. ‘బింబిసార’ చిత్రంలో కళ్యాణ్ రామ్ మగధ సామ్రాజ్యాధినేత బింబిసారుడిగా కనిపించనున్నారు. ఆయన పాత్రలోని వాడి, వేడితో.. శత్రు భయంకరుడిగా పవర్ఫుల్ పాత్రలో కళ్యాణ్ రామ్ ఎలా మెప్పించారనే విషయాన్ని ట్రైలర్తో సింపుల్గా టచ్ చేశారు. రీసెంట్గా విడుదలైన ట్రైలర్, పాట మంచి స్పందనను రాబట్టుకోవడమే కాకుండా.. సినిమాపై భారీగా అంచనాలను పెంచాయి. తాజాగా విడుదలైన పాట కూడా ప్రేక్షకులని అలరిస్తోంది. ఆగస్ట్ 5న థియేటర్లలోకి రానున్న ఈ చిత్రం ప్రేక్షకులని ఖచ్చితంగా మెప్పిస్తుందని, టాలీవుడ్లో ఎప్పటికీ నిలబడిపోయే చిత్రంగా పేరు తెచ్చుకుంటుందని మేకర్స్ తెలుపుతున్నారు.