మనీ లాండరింగ్‌ కేసులో నోరా ఫతేహీకి షాక్!

ABN , First Publish Date - 2021-10-14T19:46:01+05:30 IST

బాలీవుడ్‌ హాట్ భామ నోరా ఫతేహికి ఎన్‌ఫోర్స్‌‌మెంట్ డైరెక్టరేట్ ‌(ఈడీ) షాక్‌ ఇచ్చింది.

మనీ లాండరింగ్‌ కేసులో నోరా ఫతేహీకి షాక్!

బాలీవుడ్‌ హాట్ భామ నోరా ఫతేహికి ఎన్‌ఫోర్స్‌‌మెంట్ డైరెక్టరేట్ ‌(ఈడీ) షాక్‌ ఇచ్చింది. రూ. 200 కోట్ల మనీ లాండరింగ్‌ కేసులో ఆమెను విచారణకు పిలిచింది. దీంతో ఆమె ఈడీ ఆఫీస్‌కు ఈ రోజు (గురువారం) వెళ్లింది. ఛీటింగ్ కేసులో అరెస్ట్ అయిన సుకేష్‌ చంద్రశేఖర్‌కు సంబంధించిన కేసులో విచారణకు హాజరు కావాల్సిందిగా ఫతేహిని ఈడీ ఆదేశించింది. సుకేష్‌తో నోరా ఫతేహీకి, జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌కు సన్నిహిత సంబంధాలున్నాయని ఈడీ దృష్టికి వచ్చింది.  


ఈ కేసు విచారణలో భాగంగానే బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌ను కూడా ఈడీ అధికారులు విచారించారు. మొదట ఈ కేసులో ఆమెను కూడా నిందితురాలిగానే భావించారు. అయితే విచారణ అనంతరం ఆమె బాధితురాలు మాత్రమేనని తేల్చారు. చంద్రశేఖర్‌ తన భార్య లీనా పాల్ ద్వారా జాక్వెలిన్‌ను మోసం చేశాడని కనుగొన్నారు. కాగా, ఇదే కేసులో నోరా ఫతేహిని కూడా ప్రశ్నిస్తున్నారు. 

Updated Date - 2021-10-14T19:46:01+05:30 IST