ఏపీలో ‘మా’ ఎన్నికలకు రంగం సిద్ధం

ABN , First Publish Date - 2022-01-06T22:45:15+05:30 IST

ఏపీలో ‘మా’ ఎన్నికలకు అంతా సిద్ధం చేసినట్లుగా సంస్థ వ్యవస్థాపకుడు, దర్శకుడు దిలీప్ రాజా అధికారికంగా తెలియజేశారు. ప్రస్తుతం నామినేషన్ల ప్రక్రియ మొదలైందని, నాయకత్వ లక్షణాలున్న ఎవరైనా ఎన్నికల్లో పోటీ చేయవచ్చని

ఏపీలో ‘మా’ ఎన్నికలకు రంగం సిద్ధం

ఏపీలో ‘మా’ ఎన్నికలకు అంతా సిద్ధం చేసినట్లుగా సంస్థ వ్యవస్థాపకుడు, దర్శకుడు దిలీప్ రాజా అధికారికంగా తెలియజేశారు. ప్రస్తుతం నామినేషన్ల ప్రక్రియ మొదలైందని, నాయకత్వ లక్షణాలున్న ఎవరైనా ఎన్నికల్లో పోటీ చేయవచ్చని ఆయన తెలిపారు. పోటీ చేసే అభ్యర్థులు విధిగా భారతీయులు అయి ఉండాలని, అలాగే విధిగా మా ఏపీలో సభ్యత్వం కలిగి ఉండాలని ఆయన చెప్పారు. ఎన్నికల తేదీని మార్చ్ 31 అనంతరం ఎన్నికల అధికారి ప్రకటిస్తారని ఆయన వెల్లడించారు.


ఈ సందర్భంగా దిలీప్ రాజా మాట్లాడుతూ.. ‘‘ గతంలో కరోనా వలన యూనియన్ నియమ నిబంధనల మేరకు సకాలంలో ఎన్నికలు నిర్వహించలేకపోయాం. ప్రస్తుతం కార్యవర్గంలో అధ్యక్షులుగా ఉన్న సీనియర్ నటి కవిత, ప్రధాన కార్యదర్శి నరసింహ రాజు, కార్యదర్శి అన్నపూర్ణల పదవీ కాలం ముగిసింది. అలాగే జాయింట్ సెక్రటరీగా ఉన్న సీనియర్ హాస్య నటి శ్రీలక్ష్మి తెలంగాణా ‘మా’ ఎన్నికల్లో పోటీ చేసిన కారణంగా ఆమెను పదవి నుంచి.. నియమ నిబంధనల మేరకు రెండు యూనియన్‌లలో ఉండే అవకాశం లేదు కాబట్టి ఆమెను మా ఏపి నుండి తొలగించడం జరిగింది. రాష్ట్ర విభజన అనంతరం విభజన చట్టం నిబంధనల మేరకు ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధి కావాలనే ఆలోచనతో 2018లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ 24 విభాగాలతో యూనియన్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హెచ్ - 196 నంబర్ తో 14.2.2018 న ఆమోదించింది. 24 విభాగాలకు చెందిన 400 మంది టెక్నీషియన్లు, నటీనటులు ఇందులో సభ్యులుగా ఉన్నారు.


ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వారెవరైనా భారతీయులు అయి ఉంటే చాలు. నాయకత్వ లక్షణాలున్న ఎవరైనా ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. అయితే పోటీ చేసే అభ్యర్థులు విధిగా భారతీయులు అయి ఉండాలని, అలాగే విధిగా మా ఏపీలో సభ్యత్వం కలిగి ఉండాలి. 24 విభాగాల్లో పలు శాఖల్లోని సాంకేతిక నిపుణులు కూడా ఎన్నికలలో పోటీ చేయవచ్చు. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వారు ‘మా ఏపి ఎన్నికలు, మా ఏపీ కార్యాలయం, ఆలపాటి నగర్, సుల్తానాబాద్, తెనాలి 522 201, ఆంధ్రప్రదేశ్’ చిరునామాకు తమ దరఖాస్తును తెల్ల కాగితంపై రాసి పంపాలి. అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, ట్రేజరర్, ఈసీ మెంబర్లకు ఎన్నికలు జరుగుతాయి. ప్రస్తుతం నామినేషన్ల స్వీకరణ జరుగుతుంది. ఎన్నికల తేదీని మార్చ్ 31 అనంతరం ఎన్నికల అధికారి ప్రకటిస్తారు..’’ అని తెలిపారు.

Updated Date - 2022-01-06T22:45:15+05:30 IST