వీల్ చెయిర్లో నిత్యమీనన్.. అసలేం జరిగింది?
ABN , First Publish Date - 2022-06-28T20:18:42+05:30 IST
అందం, అభినయంలో అందెవేసిన చెయ్యి మల్లూ బ్యూటీ నిత్యమీనన్ (Nitya Menon). అసలేమాత్రం గ్లామర్ పాత్రలు చేయకుండా.. కేవలం తన పెర్ఫార్మెన్స్ తోనే దక్షిణాది ప్రేక్షకుల్ని మెప్పించిన టాలెంట్ ఆమెది.
అందం, అభినయంలో అందెవేసిన చెయ్యి మల్లూ బ్యూటీ నిత్యమీనన్ (Nitya Menon). అసలేమాత్రం గ్లామర్ పాత్రలు చేయకుండా.. కేవలం తన పెర్ఫార్మెన్స్ తోనే దక్షిణాది ప్రేక్షకుల్ని మెప్పించిన టాలెంట్ ఆమెది. తెలుగు,తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో వైవిధ్యమైన పాత్రలెన్నో పోషించి వాటికి వన్నె తెచ్చిపెట్టిన ఆమె ఇటీవల ‘భీమ్లానాయక్’ (Bheemla Nayak) చిత్రంలో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సరసన కథానాయికగా నటించి అభిమానుల్ని ఆకట్టుకుంది. ప్రస్తుతం ‘19 1 (A)’ మలయాళం చిత్రంలోనూ, ‘తిరుచిత్రాంబళం’ (Thiruchitrambalam) తమిళ సినిమాలోనూ నటిస్తోంది నిత్యామీనన్. వాటిలో తన పోర్షన్ ను కంప్లీట్ చేసింది.
తాజాగా నిత్యామీనన్ వీల్ చెయిర్ లో ఒక ఫంక్షన్ హాజరయిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్ గా మారింది. ఆ ఫోటోను చూసి షాకయిన అభిమానులు ఆమెకు ఏం జరిగింది? అనే ఆందోళనలో ఉన్నారు. ఇటీవల ‘మోడ్రన్ లవ్ ఇన్ హైదరాబాద్’ (Modern Love In Hyderabad) అనే సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ కు నిత్యామీనన్ వీల్ చెయిర్ లో ప్రత్యక్షం కావడం వార్తల్లో నిలిచింది. మెట్ల మీంచి పడ్డం వల్ల కాలు విరిగిన సంగతి నిత్యామీనన్ ఆ తర్వాత రివీల్ చేసింది. ఆమె త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ప్రస్తుతం తన కాలు విరగడంతో కొత్త ప్రాజెక్టులేమీ ఒప్పుకోలేదు. మరో మూడు నెల్లో తిరిగి ఆమె కోలుకుంటుందని డాక్టర్స్ చెప్పారట. అంత వరకూ నిత్యామీనన్ కు వీల్ చెయిర్ తప్పదు.