టపాసులు కాల్చడం మానేయండి అన్నందుకు.. ఆంటీ అంటూ నేహా ధూపియాను ట్రోలింగ్ చేసిన నెటిజన్లు

ABN , First Publish Date - 2021-11-06T21:29:28+05:30 IST

డిజిటల్ యుగంలో ఆన్‌లైన్ ట్రోలింగ్ అనేది అధికమైంది. ఆలియా భట్, కరీనా కపూర్, కాజోల్‌లను నెటిజన్లు చేసిన ట్రోలింగ్‌ను మరవక ముందే తాజాగా మరొకరు దీని బారిన పడ్డారు.

టపాసులు కాల్చడం మానేయండి అన్నందుకు.. ఆంటీ అంటూ నేహా ధూపియాను ట్రోలింగ్ చేసిన నెటిజన్లు

డిజిటల్ యుగంలో ఆన్‌లైన్ ట్రోలింగ్ అనేది అధికమైంది. ఆలియా భట్, కరీనా కపూర్, కాజోల్‌లను నెటిజన్లు చేసిన ట్రోలింగ్‌ను మరవక ముందే తాజాగా మరొకరు దీని బారిన పడ్డారు. దీపావళి సందర్భంగా టపాసులను కాల్చడం మానండని ఒక బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రజలను కోరడంతో ఆమెను నెటిజన్లు తీవ్రంగా ట్రోలింగ్ చేశారు. 


జిస్మ్ సినిమాలో నటించి కుర్రకారు గుండెలను కొల్లగొట్టిన నటి నేహా ధూపియా. దీపావళి సందర్భంగా టపాసులను కాల్చడం మానేయండని సోషల్ మీడియాలో ఆమె విజ్ఞప్తి చేసింది. టపాసులు అనేవి పర్యావరణానికి హాని కలుగజేస్తాయని చెప్పింది. దీంతో సోషల్ మీడియా యూజర్స్ ఆమెను ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టారు.  ‘‘ దయచేసి టపాసులను కాల్చడం  ఆపేయండి. పర్యావరణానికి ఇవి హానిని కలుగజేస్తాయి. ఇవి మనల్ని ఇబ్బందులకు గురిచేస్తాయి. భవిష్యత్ తరాలకు కూడా ఇవి ఎంతో హానిని కలుగజేస్తాయి ’’ అని ట్విట్టర్‌లో ఆమె పోస్ట్ చేసింది. 

 

ఆమె పెట్టిన పోస్ట్‌కు అనేక మంది నెటిజన్లు స్పందించారు. ‘‘ ముందుగా విలాసవంతమైన జీవితాన్ని గడపడం ఆపేయండి. గాలిలో కార్బన్ స్థాయిలు పెరగడానికి ఇది కూడా ఒక కారణం. మీ జీవితం కూడా ప్రజలను తీవ్రమైన ఇబ్బందులకు గురిచేస్తుంది ’’ అని ఒక నెటిజన్ ట్రోల్ చేశారు. ‘‘ పర్యావరణ మార్పులకు టపాసులు ఏ మాత్రం కారణం కాదు. గాలిని  ఏ 5కారకాలు కలుషితం చేస్తాయో మీకు తెలుసా. ముందుగా ఫ్రిడ్జ్ ఉపయోగించడం ఆపేసి తర్వాత బోధించండి ’’ మరో నెటిజన్ తన స్పందనను తెలిపారు. ఆమె హుక్కాతో ఏంజాయ్ చేస్తున్న ఫొటోను ఒక సోషల్ మీడియా యూజర్ పోస్ట్ చేసి దాని కింద హ్యాపీ బర్త్ డే నేహా ఆంటీ అని కామెంట్‌ చేశారు. 


నేహా ధూపియా చివరగా దేవి అనే షార్ట్ ఫిలింలో నటించింది. ఈ సినిమాలో కాజోల్, శృతి హాసన్ కీలక పాత్రలు పోషించారు. హిందీ మీడియం, తుమ్హరీ సులు, సింగ్ ఈజ్ కింగ్, లస్ట్ స్టోరీస్ వంటి విమర్శకుల ప్రశంసలు పొందిన అనేక చిత్రాల్లో ఆమె నటించింది. 



Updated Date - 2021-11-06T21:29:28+05:30 IST