Varun Dhawan, కియారా అడ్వాణీలకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలంటున్న నెటిజన్స్
ABN , First Publish Date - 2022-06-15T21:06:44+05:30 IST
వరుణ్ ధావన్ (Varun Dhawan), కియారా అడ్వాణీ (Kiara Advani) కీలక పాత్రలు పోషించిన చిత్రం ‘జుగ్జుగ్ జీయో’ (Jugjugg Jeeyo). ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది.
వరుణ్ ధావన్ (Varun Dhawan), కియారా అడ్వాణీ (Kiara Advani) కీలక పాత్రలు పోషించిన చిత్రం ‘జుగ్జుగ్ జీయో’ (Jugjugg Jeeyo). ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. అందువల్ల చిత్రబృందం ప్రమోషన్స్ను వేగవంతం చేసింది. ముంబై మెట్రోలో సందడి చేసింది. ఈ సందర్భంగా హీరో, హీరోయిన్ ట్రైన్లో వడ పావ్ తిన్నారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నిబంధనలు పాటించకుండా మెట్రోలో ఆహారం తిన్నందుకు వారికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని నెటిజన్స్ డిమాండ్ చేస్తున్నారు.
నిబంధనల ప్రకారం మెట్రోలో ఆహారం తినడం నిషిద్ధం. ఏది ఏమైనప్పటికీ వరుణ్, కియారాలకు ఈ రూల్ గురించి తెలియదని కొంత మంది చెబుతున్నారు. అందువల్లే వారు మెట్రోలో వడపావ్ తిన్నారని పేర్కొంటున్నారు. ‘జుగ్జుగ్ జీయో’ సినిమాకు రాజ్ మెహతా (Raj Mehta) దర్శకత్వం వహించాడు. దర్మ ప్రొడక్షన్స్ పతాకంపై కరణ్ జోహార్ నిర్మించాడు. అనిల్ కపూర్, నీతూ కపూర్ కీలక పాత్రలు పోషించారు. జూన్ 24న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ మూవీ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందినట్టు తెలుస్తోంది. ఈ సినిమాలోని పాటలు ఇప్పటికే శ్రోతలను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.