Netizens fire on anasuya: అనసూయతో కిక్ లేదా?.. ఆ డైలాగ్ అడల్ట్ కాదా?
ABN , First Publish Date - 2022-08-26T23:38:16+05:30 IST
యాంకర్, నటి అనసూయకు సోషల్ మీడియాలో వివాదాలు కొత్తేమీ కాదు. తరచూ ఏదో అంశంపై గొంతు ఎత్తడం సంబంధిత పోస్ట్లు చేయడం, ట్రోలింగ్కి గురి కావడం ఆమెకు అలవాటే! ఎన్నో సందర్భాల్లో నెటిజన్లకు ఘాటైన మాటలలో వార్నింగ్ కూడా ఇచ్చారామె! తాజాగా మరోసారి ఆమె ట్రోలింగ్కు గురై సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉన్నారు. అందుకు ఆమె నెటిజన్లకు మరోసారి వార్నింగ్ ఇచ్చారు.
యాంకర్, నటి అనసూయ(Anasuya Bharadwaj)కు సోషల్ మీడియాలో వివాదాలు కొత్తేమీ కాదు. తరచూ ఏదో అంశంపై గొంతు ఎత్తడం సంబంధిత పోస్ట్లు చేయడం, ట్రోలింగ్కి గురి కావడం ఆమెకు అలవాటే! ఎన్నో సందర్భాల్లో నెటిజన్లకు ఘాటైన మాటలలో వార్నింగ్ కూడా ఇచ్చారామె! తాజాగా మరోసారి ఆమె ట్రోలింగ్కు గురై సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉన్నారు. అందుకు ఆమె నెటిజన్లకు మరోసారి వార్నింగ్ ఇచ్చారు. తనను, తన కుటుంబాన్నీ అవమానిస్తూ పోస్ట్లు చేసే వాళ్లపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని అన్నారు. ఈ మేరకు వరుస ట్వీట్లతో ట్విట్టర్ను హోరెత్తించారు. అసలు అనసూయ వార్నింగ్ ఇవ్వడానికి కారణం ఏంటంటే.. గురువారం ఆమె ఓ ట్వీట్ చేశారు. ‘తల్లిని అన్న ఉసురు ఊరికే పోదు. కర్మ.. కొన్నిసార్లు రావటం లేటవ్వచ్చేమో కానీ, రావటం మాత్రం పక్కా!!’ అని ఆమె పెట్టిన ట్వీట్పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. తను ఎవరిని ఉద్దేశించి ఆ ట్వీట్లో చేశారో క్లారిటీ లేనప్పటికీ కొందరు మాత్రం ‘లైగర్’ ఫ్లాప్ కావడంతో విజయ్ దేవరకొండను ఉద్దేశించే అనసూయ ట్వీట్ చేసిందని అభిప్రాయపడుతూ గురువారం నుంచి ఆమెను విపరీతంగా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. అక్కడి నుంచి ట్వీట్ల వర్షం కురుస్తూనే ఉంది. అందులో చాలా ట్వీట్లకు అనసూయ రిప్లై ఇచ్చారు. శుక్రవారం ట్రోలింగ్ మరింత పెరగడంతో అనసూయ ఘాటుగా స్పందించారు. తన కుటుంబాన్ని ఈ గొడవల్లోకి లాగితే...కటకటాల్లోకి పంపిస్తానని హెచ్చరించారు. (Anasuya warnings to Netizens)
‘‘ ఛీ.. ఛీ’ ఇంత చెత్తా!! బాబోయ్.. క్లీన్ చేసి చేసి విసుగొస్తోంది. ఇలాంటి వివాదాల్లోకి నా కుటుంబాన్ని లాగితే కటకటాల్లోకి పంపించాల్సి ఉంటుంది. ఎంతోమంది నన్ను ఎన్నో అంటున్నారు. అయినా నేను మంచి మనసుతో వ్యవహరిస్తునందుకు ఇలా చేస్తున్నారు కదా! మున్ముందు నన్ను ‘ఆంటీ’ అని పిలుస్తూ అవమానించేలా పోస్టులు పెట్టిన ప్రతి ఒక్కరి అకౌంట్ స్ర్కీన్షాట్ తీసుకుని పోలీస్ కేసు పెడతా. అన్యాయంగా నన్ను ఇబ్బంది పెట్టినందుకు బాదపడేలా చేస్తా. ఇదే నా చివరి వార్నింగ్’’ అంటూ అనుసూయ మండిపడ్డారు. అయినప్పటికీ నెటిజన్లు తగ్గడం లేదు. అలా పోలీస్ కేసులు పెడితే 90 శాతం ట్విట్టర్ యూజర్స్ జైల్లోనే ఉండాలి అని ఓ నెటిజన్ కౌంటర్ ఇచ్చాడు. (Anasuya warnings to trollers).
‘‘మీ షోల్లో అడల్ట్ జోక్స్ వేస్తునప్పుడు మీరెందుకు రియాక్ట్ కావడం లేదు. హీరు చేసిన ఓ షోలో ‘మందు తాగితేనే కిక్ వస్తుందా? అనసూయతో రాదా? అనే డైలాగ్ చెప్పారు. అది అడల్ట్ కాదా? మీరు చేసిన సినిమాల్లో 18 ప్లస్ డైలాగ్లు లేవా? అని ఓ నెటిజన్ ప్రశ్నించగా ‘‘ఒకటి అడుగుతాను అది చెప్పండి.. సినిమా లేదా టీవీ షో అక్కడ ఇన్వాల్వ్ అయిన వారి పర్మిషన్తో కంటెంట్ క్రియేట్ చేస్తుంటారు. దానిని తీసుకుని పర్సనల్గా, డైరెక్ట్గా ఒకరిని కించపరడం, అబ్యూస్ చేయడంలో మీకు నిజంగా తేడా తెలియడం లేదా’’ అని అనుసూయ రివర్స్ కౌంటర్ ఇచ్చారు. వ్యక్తిగత జీవితానికి, వృత్తికి తేడా తెలియని మూర్ఖులతో ఆవేశ పోరాటం ఎందుకు అని చాలామంది సినీ పెద్దలు ఫోన్ చేసి చెబుతున్నారు. వాళ్ల మీద గౌరవంతో గ్యాప్ ఇస్తున్నా. కానీ ఎవరినీ వదలను’’ అని అనుసూయ భరద్వాజ్ అన్నారు.