నేనేమో మోతెవరి.. నువ్వేమో తోతాపరి

ABN , First Publish Date - 2022-06-27T10:02:34+05:30 IST

ఐదు వేర్వేరు కథలతో తెరకెక్కిన ఆంథాలజి ‘పంచతంత్ర కథలు’. గంగనమోని శేఖర్‌ దర్శకుడు. డి.మధు నిర్మాత. ఈ చిత్రంలోని ‘నేనేమో మోతెవరి..

నేనేమో మోతెవరి.. నువ్వేమో తోతాపరి

ఐదు వేర్వేరు కథలతో తెరకెక్కిన ఆంథాలజి ‘పంచతంత్ర కథలు’. గంగనమోని శేఖర్‌ దర్శకుడు. డి.మధు నిర్మాత. ఈ చిత్రంలోని ‘నేనేమో మోతెవరి.. నువ్వేమో తోతాపరి’ అనే గీతాన్ని యువ దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ చేతుల మీదుగా విడుదల చేశారు. కాసర్ల శ్యామ్‌ రచించిన ఈ గీతాన్ని రామ్‌ మిరియాల ఆలపించారు. కమ్రాన్‌ సంగీతాన్ని అందించారు. ‘‘ఈ సినిమా రఫ్‌ కట్‌ చూసినప్పుడే ఈ పాట విన్నాను. వినగానే బాగా నచ్చేసింది. తప్పకుండా వైరల్‌ అవుతుందని అనిపించింది. కాస్లర్య శ్యామ్‌ సాహిత్యం బాగుంద’’న్నారు తరుణ్‌ భాస్కర్‌. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తయ్యాయని, త్వరలోనే చిత్రాన్ని విడుదల చేస్తామని దర్శక నిర్మాతలు తెలిపారు. నోయెల్‌, నందినిరాయ్‌, సాయి రోనక్‌, గీతా భాస్కర్‌, ప్రణీత పట్నాయక్‌ తదితరులు నటించారు.


Updated Date - 2022-06-27T10:02:34+05:30 IST