ప్రేమ విషయంలో నన్ను, ఆలియా భట్ను రణ్బీర్ కపూర్ బ్యాలెన్స్ చేస్తున్నారు: Neetu Kapoor
ABN , First Publish Date - 2022-06-22T23:35:37+05:30 IST
రణ్బీర్ కపూర్ (Ranbir Kapoor) తల్లి నీతూ కపూర్ (Neetu Kapoor) దాదాపు తొమ్మిదేళ్ల అనంతరం తిరిగి సినిమాలు చేస్తున్నారు. రిషి కపూర్ మృతి చెందిన తర్వాత తాజాగా జుగ్జుగ్ జీయో (JugJugg Jeeyo)
రణ్బీర్ కపూర్ (Ranbir Kapoor) తల్లి నీతూ కపూర్ (Neetu Kapoor) దాదాపు తొమ్మిదేళ్ల అనంతరం తిరిగి సినిమాలు చేస్తున్నారు. రిషి కపూర్ మృతి చెందిన తర్వాత తాజాగా జుగ్జుగ్ జీయో (JugJugg Jeeyo) సినిమాలో నటించారు. ఈ సినిమా జూన్ 24న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్లో భాగంగా ఆమె మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో ఆసక్తికర కబుర్లను అభిమానులతో పంచుకున్నారు.
ఒకసారి నటిగా మారితే జీవితాంతం నటే అని నీతూ కపూర్ తెలిపారు. ‘‘ఒకసారి బ్రేక్ వస్తే సినిమాల్లో నటించడానికి మరింత ఆత్మ విశ్వాసం కావాలి. నటన అనేది నా పని. అది నన్ను చాలా బిజిగా ఉంచుతుంది. నాతో ఎవరూ లేరు. నా ఇద్దరు పిల్లల పెళ్లి అయిపోయింది. ఒంటరిగా ఉన్నప్పుడు నేను ఏం చేయగలను. నా గతం గురించి ఆలోచించుకుంటూ విచారంగా మాత్రమే ఉండగలను. అందువల్లే విరామం అనేది లేకుండా పని చేయాలనుకుంటున్నాను. రణ్బీర్ కపూర్, ఆలియా భట్ (Alia Bhatt) చాలా సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నారు. ఆలియాతో నా బంధం ఎలా ఉందని చాలా మంది అడుగుతున్నారు. నేను, నా అత్తతో ఏలా ఉన్నానో అలియాతో నా బంధం అలానే ఉంది. ఆలియా చాలా మంచి అమ్మాయి. కల్మషం లేని వ్యక్తి. అందరిపై ప్రేమను కురిపిస్తుంది. అత్త, కోడళ్ల మధ్య బంధం బాగా లేకపోతే తప్పు భర్తదే. అమ్మ అని కొడుకు ప్రేమిస్తారు. ఆమె గులాంగిరి చేయడం మొదలుపెడితేనే ఇబ్బందులు తలెత్తుతాయి. మీకు పెళ్లయ్యాక ప్రేమ విషయంలో అమ్మ, భార్య మధ్య బ్యాలెన్స్ చేస్తే అద్భుతంగా ఉంటుంది. అమ్మ అప్పుడు ప్రేమిస్తుంది. భార్యను ఎక్కువగా ప్రేమించినప్పుడే అమ్మ బాధపడుతుంది. నన్ను, ఆలియా భట్ను రణ్బీర్ కపూర్ బ్యాలెన్స్ చేస్తున్నారు. ఈ రోజుల్లో ఎవరికి సలహాలు ఇవ్వకూడదు. ఎందుకంటే వారు అన్ని నేర్చుకుని వస్తారు. ఎవరి మాట వినరు. అందువల్ల సలహాలు ఇవ్వడానికి దూరంగా ఉండాలి’’ అని నీతూ కపూర్ చెప్పారు.