Nayanthara-Vignesh Shivan: థాయ్లో ఎంజాయ్ చేస్తున్న కొత్తజంట.. వైరల్ అవుతున్న Honeymoon పిక్స్
ABN , First Publish Date - 2022-06-26T19:10:29+05:30 IST
దాదాపు ఏడేళ్లుగా డేటింగ్ చేసిన నయనతార (Nayanthara), విఘ్నేష్ శివన్ జంట ఇటీవలే పెళ్లిబంధంలో ఒకటైన విషయం తెలిసిందే.
దాదాపు ఏడేళ్లుగా డేటింగ్ చేసిన నయనతార (Nayanthara), విఘ్నేష్ శివన్ జంట ఇటీవలే పెళ్లిబంధంలో ఒకటైన విషయం తెలిసిందే. జూన్ 9న మ్యారేజ్ చేసుకున్న ఈ జంట ప్రస్తుతం థాయ్లాండ్ (Thailand)లో హానీమూన్ని ఎంజాయ్ చేస్తోంది. వివాహం తర్వాత వీరిద్దరూ మొదటిసారి వేకేషన్ కోసం వెళ్లిన పిక్స్ని విఘ్సేష్ తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అందులో.. నయనతార తెల్లటి టాప్, బ్లూ డెనిమ్లో ఉండగా.. డైరెక్టర్ క్రీమ్ షర్ట్, ప్యాంటులో ఉన్నాడు. ఎంతో క్యూట్గా, అందంగా ఈ కపుల్ పిక్స్ ప్రస్తుతం ఇన్స్టాగ్రామ్లో వైరల్గా మారాయి.
ఆ పోస్ట్కి.. వేకేషన్లో వారికి సపోర్టుగా నిలిచిన ట్రావెల్స్కి, అభిమానులకి ధన్యవాదాలు తెలుపుతూ విఘ్నేశ్ క్యాప్షన్ రాసుకొచ్చాడు. ఈ యంగ్ డైరెక్టర్ పోస్ట్పై పలువురు నెటిజన్లు స్పందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ‘చాలా బావున్నారు’, ‘ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ పోస్ట్కి ముందు సైతం నయనతార సింగిల్గా ఉన్న పలు ఫొటోలని విఘ్నేష్ షేర్ చేశాడు. అందులో.. ఈ జంట ఒకరినొకరి సెల్ఫొన్లో బంధిస్తున్నారు.
కాగా.. నయనతార ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ చేస్తున్న ‘జవాన్’ చిత్రంతో బాలీవుడ్లోకి అడుగుపెడుతోంది. అలాగే.. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవితో ‘గాడ్ఫాదర్’, మలయాళీ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్తో ‘గోల్డ్2 అనే చిత్రంలో నటిస్తోంది. అలాగే.. విఘ్నేశ్ సైతం తమిళ స్టార్ హీరో అజిత్లో ఓ సినిమా చేయనున్నాడు. ‘ఏకే62’ వర్కింగ్ టైటిల్తో తెరకెక్కుతున్న ఈ మూవీ త్వరలో సెట్స్పైకి వెళ్లనుంది.