Nayanatara: ఎమ్ఎస్. ధోని నిర్మాణంలో సినిమాపై క్లారిటీ వచ్చేసింది..
ABN , First Publish Date - 2022-05-14T14:23:55+05:30 IST
ఎమ్ఎస్. ధోని నిర్మాణంలో సినిమాపై క్లారిటీ వచ్చేసింది. సౌత్ సినిమా ఇండస్ట్రీలలో నయనతారకు ఉన్న క్రేజ్ ఏపాటిదో అందరికీ తెలిసిందే. అగ్ర హీరోల సరసన సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న నయన్..లేడీ ఓరియెంటెడ్
ఎమ్ఎస్. ధోని (M S Dhoni) నిర్మాణంలో సినిమాపై క్లారిటీ వచ్చేసింది. సౌత్ సినిమా ఇండస్ట్రీలలో నయనతార (Nayanatara)కు ఉన్న క్రేజ్ ఏపాటిదో అందరికీ తెలిసిందే. అగ్ర హీరోల సరసన సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న నయన్..లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్గా మారింది. ఇటీవలే తన కాబోయో భర్త నిర్మాణంలో రూపొందిన కాథు వాక్కుల రెండు కాదల్ (Kathuvaakkula Rendu Kadal) సినిమాతో వచ్చి హిట్ అందుకుంది. ఇందులో సమత (Samantha), విజయ్ సేతుపతి (Vijay Sethupathi) కూడా నటించిన సంగతి తెలిసిందే. అయితే, ఇటీవల ఓ వార్త వచ్చి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఇండియన్ క్రికెటర్ ఎమ్ఎస్. ధోని నిర్మాణంలో నయనతార ఓ భారీ సినిమా చేయబోతుందని అంతటా ప్రచారం జరుగుతోంది. రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ధోని పలు వ్యాపారాల్లో పెట్టుబడులు పెడుతున్నారు. ఇప్పటికే రెస్టారెంట్ వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. అలాగే, పౌల్ర్టీ వ్యాపారంలోనూ పెట్టుబడులు పెడుతున్నారట. ఇదే క్రమంలో చిత్ర నిర్మాణ రంగంలోకీ అడుగుపెట్టి వరుసగా సినిమాలు నిర్మించాని డిసైడయ్యాడు. ఇప్పటికే ధోని ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో బ్యానర్ స్థాపించాడు.
ఇక ఇందులో మొదటి ప్రయత్నంగా సౌత్ స్టార్ హీరోయిన్ నయనతారతో ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాను రూపొందించనున్నట్టు ఇన్నాళ్ళు వార్తలు వచ్చాయి. కానీ, ఇవన్నీ కేవలం సోషల్ మీడియాలో క్రియేట్ అయిన గాసిప్సేనట. తాజాగా ఈ వార్తలపై ధోని ప్రొడక్షన్ టీమ్ స్పందించింది. ఈ వార్తల్లో నిజం లేదని తేల్చిపారేసింది. ప్రస్తుతానికి తమ టీమ్ ఓ ఎగ్జైటింగ్ ప్రాజెక్ట్ కోసం వర్క్ చేస్తున్నట్టు వెల్లడించింది. ఇక ఈ కొత్త ప్రాజెక్ట్కు సంబంధించిన అన్నీ వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని అప్పటి వరకూ ఎలాంటి అసత్యాలు ప్రచారం చేయోద్దని విజ్ఞప్తి చేసింది. కాగా, నయన్ ప్రస్తుతం టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) హీరోగా రూపొందుతున్న గాడ్ గాదర్ (God Father) సినిమాలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇక జూన్ 9న విఘ్నేష్ శివన్ను పెళ్లి చేసుకోబోతోంది.