ఆ నటి ఆత్మహత్యకి వాళ్లే కారణం : NCB పై మంత్రి సంచలన ఆరోపణలు

ABN , First Publish Date - 2021-12-27T02:57:49+05:30 IST

ఎన్సీబీ చీఫ్‌గా ఉన్న సమీర్ వాంఖడేను సైతం పదే పదే టార్గెట్ చేసిన నవాబ్ మాలిక్ ఈసారి ఎన్సీబీ అధికారుల పేర్లేవీ ప్రస్తావించలేదు. కానీ, నార్కోటిక్స్ బ్యూరో తరుఫున ఓ ప్రైవేట్ ఆర్మీ నడుస్తోందని ఆరోపించారు...

ఆ నటి ఆత్మహత్యకి వాళ్లే కారణం : NCB పై మంత్రి సంచలన ఆరోపణలు

నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) ఏర్పాటు చేసిన ప్రైవేట్ ఆర్మీ ముంబైలో బెదిరింపులకు, వసూళ్లకు పాల్పడుతోందని నవాబ్ మాలిక్ ఆరోపించారు. ఆయన మహారాష్ట్ర కేబినేట్‌లో మంత్రి. షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు విషయంలో ఎన్సీబీని తీవ్రంగా తప్పుబట్టారు. ఆర్యన్‌కు, షారుఖ్‌కు అందరికంటే ఎక్కువగా మద్దతిచ్చారు. ఇప్పుడు మరోసారి దర్యాప్తు సంస్థపై నోరు చేసుకున్నారు... 


ఎన్సీబీ చీఫ్‌గా ఉన్న సమీర్ వాంఖడేను సైతం పదే పదే టార్గెట్ చేసిన నవాబ్ మాలిక్ ఈసారి ఎన్సీబీ అధికారుల పేర్లేవీ ప్రస్తావించలేదు. కానీ, నార్కోటిక్స్ బ్యూరో తరుఫున ఓ ప్రైవేట్ ఆర్మీ నడుస్తోందని ఆరోపించారు. గోసవీ, మనీష్ భానుశాలి వంటి వారు ఎన్సీబీ అండతో బెదిరింపులకు పాల్పడుతున్నారని వ్యాఖ్యానించారు. అంతే కాదు, గత గురువారం ఓ భోజ్‌పురి యువ నటి ఆత్మహత్య చేసుకుందని చెప్పిన ఆయన ఆమె మృతికి బెదిరింపులే కారణమని అన్నారు. ఓ రేవ్ పార్టీలో తను కనిపించటంతో ఎన్సీబీ తాలూకూ మనుషులమంటూ ఇద్దరు నిందితులు బ్లాక్‌మెయిల్ చేశారు. వారి ఒత్తిడికి తట్టుకోలేక ఆమె లక్షల కొద్దీ డబ్బులు ముట్టజెప్పి కూడా ఉరి వేసుకుని మరణించింది. ముంబై పోలీసులు నటి మరణానికి కారకులుగా భావిస్తున్న వార్ని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. వారి వెనుక ఎన్సీబీ పరోక్షంగా ఉందని తాజాగా నవాబ్ మాలిక్ ఆరోపిస్తున్నారు. సమగ్ర విచారణ జరగాలని డిమాండ్ చేస్తున్నారు...  

Updated Date - 2021-12-27T02:57:49+05:30 IST