'నాట్యం': విడుదల తేదీ ఖరారు
ABN , First Publish Date - 2021-09-19T15:19:20+05:30 IST
ప్రముఖ కూచిపూడి నాట్యకారిణి సంధ్యారాజు ప్రధాన పాత్రలో నటిస్తూ, స్వీయ నిర్మాణంలో రూపొందిస్తున్న చిత్రం 'నాట్యం'. తాజాగా ఈ మూవీ విడుదల తేదీని ఖరారు చేసింది చిత్రబృందం.
ప్రముఖ కూచిపూడి నాట్యకారిణి సంధ్యారాజు ప్రధాన పాత్రలో నటిస్తూ, స్వీయ నిర్మాణంలో రూపొందిస్తున్న చిత్రం 'నాట్యం'. తాజాగా ఈ మూవీ విడుదల తేదీని ఖరారు చేసింది చిత్రబృందం. యంగ్ డైరెక్టర్ రేవంత్ కోరుకొండ తెరకెక్కిస్తున్న ఇందులో కమల్ కామరాజ్, శుభలేఖ సుధాకర్, భానుప్రియ కీలక పాత్రలు పోషిస్తున్నారు. నాట్య ప్రధానంగా సాగే ఈ చిత్రం నుంచి రీసెంట్గా విడుదల చేసిన తొలి పాట ‘నమఃశివాయ’ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. కాగా ఈ సినిమాను అక్టోబరు 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని చిత్రబృందం శనివారం అధికారికంగా ప్రకటించింది.