Naresh - Pavithra: మైసూర్ కొరం హోటల్ వద్ద రచ్చ..

ABN , First Publish Date - 2022-07-03T18:52:48+05:30 IST

సీనియర్ నటుడు వీకే నరేష్ (VK Naresh), నటి పవిత్రా లోకేష్ (Pavithra Lokesh) ఎపిసోడ్ మైసూర్‌కు చేరింది. ఓ హోటల్‌లో ఉంటున్న పవిత్ర, నరేష్‌ కెమెరా కంటపడ్డారు.

Naresh - Pavithra: మైసూర్ కొరం హోటల్ వద్ద రచ్చ..

సీనియర్ నటుడు వీకే నరేష్ (VK Naresh), నటి పవిత్రా లోకేష్ (Pavithra Lokesh) ఎపిసోడ్ మైసూర్‌కు చేరింది. ఓ హోటల్‌లో ఉంటున్న పవిత్ర, నరేష్‌ కెమెరా కంటపడ్డారు. వీరు హోటల్‌‌లో స్టే చేస్తున్న విషయం తెలుసుకున్న నరేష్ మూడో భార్య రమ్య (Ramya Raghupathi) అక్కడికి చేరుకున్నారు. అక్కడ పవిత్ర, నరేష్‌ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా పవిత్రను ఆమె చెప్పుతో కొట్టేందుకు ప్రయత్నించారు. రమ్యను పోలీసులు అడ్డుకున్నారు. రమ్యను చూసి నరేష్ విజిల్స్ వేసుకుంటూ.. పవిత్రతో కలిసి లిఫ్ట్‌లో వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన న్యూస్‌ హల్‌చల్ అవుతోంది.


నరేష్, పవిత్రా లోకేష్ పెళ్లి చేసుకుంటున్నారంటూ గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి తెరపైకి వచ్చారు. నరేష్ తనకు విడాకులు ఇవ్వకుండానే మరో పెళ్లికి సిద్ధమవుతున్నాడంటూ ఆరోపణలు చేశారు. న‌రేష్ టేబుల్‌పై గ‌న్ పెట్టి బెదిరించార‌ంటూ చెప్పుకొచ్చారు. ఆమె వ్యాఖ్యలు వైరల్ కావడంతో నరేష్ కూడా ఘాటుగానే రిప్లై ఇచ్చాడు.


రమ్య ఏనాడు త‌న భార్యలా ప్రవ‌ర్తించ‌లేద‌న్నాడు న‌రేష్‌. కేవలం డబ్బుల కోసమే రమ్య బ్లాక్ మెయిలింగ్‌కి దిగిందన్నాడు. హైద‌రాబాద్‌లోనూ ఇలాగే చేసిందని.. ఇప్పుడు బెంగుళూరులో మొద‌లు పెట్టిందన్నాడు. అల‌ర్ట్ చేయ‌డానికే తాను బెంగుళూరు వ‌చ్చానని చెప్పాడు. తాను రెండు వంద‌ల సినిమాల్లో న‌టించానని.. వంద మంది హీరోయిన్స్‌కి పైగా తనతో కలిసి న‌టించారని.. ఒక మ‌హిళ అయినా తాను వారిని ఛీట్ చేశార‌ని చెప్పడం గ‌మ‌నించారా..? అని ప్రశ్నించారు. రమ్య టార్చర్ తట్టుకులేక రూ.10 లక్షలు ఇచ్చానని.. ఆ డ‌బ్బులు తీసుకుని ఇప్పుడిలా మాట్లాడుతోందని ఆరోపించాడు.


ఈ ఎపిసోడ్‌పై పవిత్రా లోకేష్ కూడా స్పందిస్తూ.. వీడియో కూడా రిలీజ్ చేసిన తెలిసిందే. తనను బ్యాడ్ చేసేందుకు రమ్యా రఘుపతి ప్రయత్నిస్తోందంటూ మండిపడ్డారు. ఆమెకు నిజంగా భర్త కావాలంటే.. హైదరాబాద్‌లో అడిగితే న్యాయం జరుగుతుందన్నారు. తాను వాళ్ల మధ్యకి వచ్చి.. రిలేషన్ షిప్‌లో ఉన్నానని.. పెళ్లి చేసుకున్నానని కర్ణాటక మీడియా ముందు రమ్య తనను దోషిగా నిలబెట్టిందన్నారు. దయచేసి ఈ విషయంలో తనకు, నరేష్‌‌కి సపోర్ట్ చేయాలని కోరారు పవిత్రా లోకేష్.


ప్రస్తుతం ఈ ఎపిసోడ్ మళ్లీ మైసూర్‌కు చేరడం చర్చనీయాశంగా మారింది. నరేష్, పవిత్ర అక్కడ హోటల్‌లో ఉన్న విషయం తెలుసుకున్న రమ్యారఘుపతి.. అక్కడి వెళ్లి అడ్డుకునే ప్రయత్నం చేశారు. కోపాన్ని ఆపులేకపోయిన ఆమె.. పవిత్రను చెప్పుతో కొట్టే ప్రయత్నం చేశారు. పోలీసులు అడ్డుకోవడంతో సరిపోయింది. లేకపోతే పవిత్రపై ఆమె దాడి చేసేవారు. అనంతరం రమ్యను చూస్తూ నరేష్ ఎంతో సంతోషంతో విజిల్స్ వేసుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

Updated Date - 2022-07-03T18:52:48+05:30 IST